Covid Origins: కొవిడ్ మూలాల శోధన.. ఇదే చివరి అవకాశం!
కొవిడ్ మూలాలపై మరోసారి దర్యాప్తునకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం.. మూలాలను శోధించేందుకు ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడింది.
అభిప్రాయపడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన మూలాలను కనుక్కోవడంలో యావత్ ప్రపంచం వెనుకబడింది. ఇప్పటికే ఓసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని దర్యాప్తు బృందం పరిశోధన చేపట్టినప్పటికీ ఫలితాన్ని ఎటూ తేచ్చలేకపోయింది. తాజాగా మరోసారి దర్యాప్తునకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం.. మూలాలను శోధించడంలో ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో నమోదైన కేసుల సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు విజ్ఞప్తి చేసింది.
కొవిడ్ వెలుగు చూసిన తొలినాళ్లనాటి కేసుల వివరాలకు సంబంధించిన సమాచారం పెద్ద చిక్కుముడిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును మరోసారి కొనసాగించేందుకు కొవిడ్ మూలాలపై ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం (SAGO)లో మొత్తం 26మంది ఉండనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీటిపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
డజనుకు పైగా అధ్యయనాలు అవసరం..
కొవిడ్ మూలాలను శోధించేందుకు డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో అంతర్జాతీయ బృందాలు చైనాలో పర్యటించాల్సి వస్తుందని.. అందుకు చైనా సహకారం అవసరమవుతుందని కొవిడ్-19పై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగాధిపతి మారియా వ్యాన్ కెర్ఖోవ్ తెలిపారు. జంతువుల నుంచి మానవులకు వైరస్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి డజన్ల కొద్దీ అధ్యయనాలు చేపట్టాల్సి ఉందని తాజాగా జరిగిన ఓ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కొవిడ్ మూలాలను అర్థం చేసుకునేందుకు కేవలం 2019లో వుహాన్లో ఉన్నవారి యాంటీబాడీలను పరీక్షించడం ఎంతో కష్టమైన పని అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, డిసెంబరు 2019 నాటికంటే ముందు తీసుకున్న రక్త నమూనాలు, అనుమానిత కేసుల వివరాలను విశ్లేషించడంతో పాటు అక్కడి ఆస్పత్రులను పరిశీలించడం, అక్కడ చోటుచేసుకున్న మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. వీటితో పాటు వుహాన్ నగరంలో మెడికల్ ల్యాబ్లపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.
ఇదే చివరి అవకాశం కావచ్చు..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి తొలిసారిగా డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్లో బయటపడిన విషయం తెలిసిందే. వాటి మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం చైనా నిపుణులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. చివరకు కొన్ని రకాల జంతువుల ద్వారా గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉండవచ్చని పేర్కొంది. వీటిని తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో నూతన బృందంతో ఈసారి చేపట్టే విచారణే కొవిడ్ మూలాలను కనిపెట్టేందుకు ఇదే ఉత్తమమైనది, ఇదే చివరి అవకాశం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సేవల నిపుణుడు మైక్ రేయాన్ స్పష్టం చేశారు.
అయితే, ఇదివరకు దర్యాప్తులో భాగంగా నాలుగు వారాలపాలు డబ్ల్యూహెచ్ఓ బృందం చైనాలో పర్యటించినప్పటికీ నిపుణులకు సరైన సమాచారం అందించలేదనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో కొవిడ్-19కు కారణమైన వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని చైనా మాత్రం తోసిపుచ్చుతోంది. అంతేకాకుండా కొవిడ్ మూలాలపై చైనాలో మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదనీ వాదిస్తోంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే.. చైనాలో కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మూలాల శోధన చేపట్టాలని ఐక్యరాజ్య సమితిలోని చైనా రాయబారి చెన్ షూ మరోసారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM