Space Tour: జపాన్ కుబేరుడి అంతరిక్ష యాత్ర సక్సెస్.. సురక్షితంగా భూమిపైకి..
జపాన్ కుబేరుడి రోదసి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. అంతరిక్ష పర్యటనకు వెళ్లిన బిలియనీర్, ఫ్యాషన్ రంగ దిగ్గజం యుసాకు మెజవా (46) సురక్షితంగా భూమిని చేరుకున్నారు.....
బైకనూర్: జపాన్ కుబేరుడి రోదసి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. అంతరిక్ష పర్యటనకు వెళ్లిన బిలియనీర్, ఫ్యాషన్ రంగ దిగ్గజం యుసాకు మెజవా (46) సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన అనంతరం.. భూమికి తిరిగివచ్చారు. మెజవాతో పాటు ఆయన ప్రొడ్యూసర్ యొజో హిరానో, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ సైతం సురక్షితంగా భూమిపై దిగారు. కజకిస్థాన్లోని జెజ్కాగన్ ప్రాంతానికి 148 కి.మీ దూరంలో సోమవారం ఉదయం 9.13 గంటలకు ల్యాండ్ అయ్యారు.
2009 తర్వాత సొంత ఖర్చులతో రోదసిలోకి బయల్దేరిన పర్యాటకులు వీరే. ఈ పర్యటన కోసం యుసాకు మెజవా భారత కరెన్సీలో రూ. 600కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈనెల 8న కజకిస్థాన్లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్ష యాత్ర చేపట్టారు. మిసుర్కిన్తో కలిసి సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి వ్యోమగాములకు ‘ఉబర్ ఈట్స్’ సంస్థ ఆహార పదార్థాలను పంపించగా.. మెజవా వాటిని చేరవేశారు.
చంద్రుడిపైకి వెళ్లేందుకు కూడా మెజవా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘డియర్ మూన్’ అని పేరు పెట్టారు. 2023లో ఈ మిషన్ను చేపట్టనున్నారు. స్టార్షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మిజవా పేరును స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2018లోనే ప్రకటించారు. స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ఎనిమిది మందిని మెజవా ఆహ్వానించారు. ఇందుకోసం ఓ పోటీ ప్రారంభించారు. పోటీలో గెలిచినవారి యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు ప్రకటించారు. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎంపిక ప్రక్రియ గురించి ఈ మెయిల్ పంపిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..