Kappa Mutations: ఈ ఏడాది.. దేశంలో కొవిడ్ విజృంభణకు అవే కారణం!
దేశంలో ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ విజృంభించడానికి కప్పా వేరియంట్లో చోటుచేసుకున్న మ్యుటేషన్లే కారణమని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
వెల్లడించిన జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకోగ్
దిల్లీ: దేశంలో ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ విజృంభించడానికి కప్పా వేరియంట్లో చోటుచేసుకున్న మ్యుటేషన్లే కారణమని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో పెరగడానికి ఇవే కారణమని పేర్కొంది. ఇక ఒమిక్రాన్ ప్రభావం ఇప్పటివరకు మన దేశంలో లేదన్న ఇన్సాకోగ్.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రాబల్యమే దేశంలో అధికంగా ఉందని తాజా బులిటెన్లో వెల్లడించింది. అయితే, ఈ వేరియంట్ను ఎదుర్కోవడంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే నిరూపితమైన విషయాన్ని జీనోమిక్స్ కన్సార్టియం గుర్తుచేసింది.
గతేడాది డిసెంబర్లో వెలుగుచూసిన కప్పా వేరియంట్ ప్రభావంతో పలుచోట్ల కొవిడ్ విజృంభణ కొనసాగింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా ప్రకటించింది. ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రతో పాటు ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లోనూ బయటపడ్డాయి. ప్రస్తుతం మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అదుపులోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వైరస్ ప్రాబల్యం, కొత్త వేరియంట్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95 వేలకుపైగా నమూనాలను విశ్లేషించగా.. లక్షా 18వేల కొవిడ్ నమూనాలకు సీక్వెన్సింగ్ చేసినట్లు ఇన్సాకోగ్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు