Kerala: కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. 388 మంది మృతి
దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే.. కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది......
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే.. కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో 6,849 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50.77 లక్షలకు, మరణాల సంఖ్య 36,475కు చేరింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొత్తగా 388 మరణాలను నివేదించింది. వీటిలో 61 మంది ఇటీవల చనిపోగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి 327 మంది కరోనాతో చనిపోయినట్లు తెలిపింది. బుధవారం మొత్తం 6,046 మంది వైరస్ నుంచి కోలుకున్నునారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 63,752కు చేరింది. మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం