Tejashwi Yadav: పెళ్లి పీటలు ఎక్కనున్న లాలూ తనయుడు..!

బిహార్ ప్రతిపక్ష నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Published : 08 Dec 2021 17:55 IST

పట్నా: బిహార్ ప్రతిపక్ష నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గురువారం ఆయన ఎంగేజ్‌మెంట్ జరగనుందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తేజస్వీ యాదవ్ సోదరి రోహిణీ ఆచార్య ఈ వివాహం గురించి ట్వీట్ చేశారు. తన సోదరుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సూచాయగా వెల్లడించారు. తమ ఇల్లంతా ఆనందంతో నిండిపోయిందని ఆమె ట్విటర్‌లో రాసుకొచ్చారు. అయితే వధువు వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం జరగబోయే వేడుక కోసం లాలూ కుటుంబం మొత్తం ఇప్పటికే దిల్లీ చేరుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. 

లాలూ తొమ్మిది మంది సంతానంలో తేజస్వీ యాదవ్ చివరివాడు. ప్రస్తుతం ఆర్జేడీ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. బిహార్‌లో విపక్ష నేతగా కొనసాగుతున్నారు రాఘోపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015 నుంచి  2017 మధ్య కాలంలో బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని