corona pandemic: సారీ.. వైఫల్యానికి బాధ్యత మాదే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిని అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వ్యాప్తిని అరికట్టేలా కఠినమైన ఆంక్షలు, కరోనాను నిరోధించే
కొవిడ్ కట్టడి చర్యలపై విమర్శలు.. దేశాధినేతల క్షమాపణలు
ఇంటర్నెట్డెస్క్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిని అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వ్యాప్తిని అరికట్టేలా కఠినమైన ఆంక్షలు, కరోనాను నిరోధించే వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు సరికదా.. రూపాంతరాలు చెందుతూ విరుచుకుపడుతూనే ఉంది. దీంతో ప్రభుత్వాల చర్యలపై విమర్శలు ఎదురవుతున్న వేళ.. కొందరు దేశాధినేతలు వాటికి తలొగ్గక తప్పట్లేదు. టీకా పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు గానూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తాజాగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
గతేడాది మహమ్మారి కట్టడిలో విజయవంతమైన ఆస్ట్రేలియా ఇటీవల మాత్రం మళ్లీ మాత్రం వైరస్ ఉద్ధృతితో సతమతమవుతోంది. సిడ్నీ సహా చాలా నగరాల్లో కొత్త కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇప్పటివరకూ కేవలం 12శాతం మంది మాత్రం రెండు డోసులు తీసుకున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. టీకాల కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై తాజాగా ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. ‘‘టీకా పంపిణీలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. దీనికి నేను క్షమాపణలు చెప్పాలి. చెబుతున్నాను కూడా. కరోనా వల్ల ఎదురైన సవాళ్లకు కూడా బాధ్యత నాదే. అయితే కొన్ని మన నియంత్రణలో ఉంటాయి. కొన్ని ఉండకపోవచ్చు’’ అని మారిసన్ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. స్కాట్ మారిసన్ మాత్రమే కాదు.. కొవిడ్ నియంత్రణ చర్యల పట్ల వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ఇటీవల పలు దేశాధినేతలు కూడా బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
విమర్శలను స్వీకరిస్తున్నా: బోరిస్
కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను ప్రభుత్వ అధికారులే పాటించడం లేదంటూ ఇటీవల యూకేలో ప్రతిపక్ష ఎంపీ తమన్జీత్సింగ్ దేశీ ప్రధాని బోరిస్ జాన్సన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ వేదికగా ప్రధానిని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలకు బోరిస్ స్పందిస్తూ.. ‘‘కరోనా వల్ల దేశ ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలకు నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రతిపక్ష ఎంపీ విమర్శలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. జరిగిన దానికి క్షమాపణలు’’ అని చెప్పుకొచ్చారు.
మా నిర్ణయం తప్పే: డచ్ ప్రధాని
నెదర్లాండ్స్లో కొద్ది రోజుల క్రితం కరోనా ఆంక్షలను సవరించారు. దీంతో ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి పెరగడమేగాక, అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం వల్లే కేసులు పెరిగాయంటూ ఆరోగ్య సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేవలం రెండు వారాలకే మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఆ సమయంలో డచ్ ప్రధాని మార్క్ రూట్ మాట్లాడుతూ.. తాము తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అంగీకరించారు. ‘‘మేం సాధ్యమవుతుందని అనుకున్నది.. అసాధ్యమని ఆచరణలో తేలింది. మేం పేలవమైన నిర్ణయం తీసుకున్నాం. అందుకు చింతిస్తున్నాం. ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని ప్రకటన చేశారు.
దక్షిణకొరియా ప్రధాని కూడా..
దక్షిణకొరియా ప్రధాని కిమ్ బూ కుమ్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆఫ్రికా సముద్ర జలాల్లో పెట్రోలింగ్ చేస్తోన్న ఓ నేవీ డిస్ట్రాయర్లో సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఆ నౌకలో మొత్తం 300 మంది ఉంటే దాదాపు 250 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. విదేశాల్లో దేశం తరఫున సేవలందిస్తున్న జవాన్లను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుయ్యబట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ కిమ్ బూ ఓ ప్రకటన చేశారు. ‘‘దేశ కోసం పనిచేస్తోన్న జవాన్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో విఫలమైనందుకు గానూ క్షమాపణలు చెబుతున్నా’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?