Living Lab: లివింగ్ ల్యాబ్.. ఓ అద్భుతం
రోజురోజుకూ వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది... మరి నియంత్రించేదెలా? నీటి నాణ్యతను లెక్కగట్టి ప్రజలకు సమాచారం చేరవేసేదెలా?
గాలి కాలుష్యం.. నీటి నాణ్యతను క్షణాల్లో పసిగట్టేస్తుంది
సమాచారం సేకరించి.. అప్రమత్తం చేస్తుంది
కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ట్రిపుల్ఐటీలో అందుబాటులోకి..
ఈనాడు, హైదరాబాద్: రోజురోజుకూ వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది... మరి నియంత్రించేదెలా? నీటి నాణ్యతను లెక్కగట్టి ప్రజలకు సమాచారం చేరవేసేదెలా? ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందించేదెలా? ఇటువంటి నిత్య సవాళ్లకు సమాధానం చెబుతోంది గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ఐటీ)లో ఏర్పాటు చేసిన లివింగ్ ల్యాబ్. 66 ఎకరాల విస్తీర్ణంలో గతేడాది డిసెంబరు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సాయంతో ప్రతి సెకనుకు డాటా సేకరించి.. సమాచారాన్ని చేరవేస్తూ అప్రమత్తం చేస్తోంది.
అలా మొదలైంది..
స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా లివింగ్ ల్యాబ్కు సహకారం అందిస్తున్నాయి. దీనిలో యూరోపియన్ బిజినెస్, టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నొవేషన్ ఎరీనా(ఏఐఏ) భాగస్వామ్యులుగా ఉన్నాయి. గాలి కాలుష్యం, నీటి నాణ్యత, వనరుల వినియోగం, వాతావరణ పరిస్థితులపై ఐవోటీ పరిజ్ఞానంతో ప్రతి 15 సెకన్లకోసారి సమాచారాన్ని సేకరించి విశ్లేషించేలా ల్యాబ్ను తీర్చిదిద్దారు. వన్ఎం2ఎం సాంకేతికతను వినియోగించి డాటాను సేకరిస్తున్నారు. సిలికాన్ ల్యాబ్స్, ఇంటెల్ సైతం సహకారం అందిస్తున్నాయి.
సెన్సర్ల నుంచి సేకరించిన డాటాను వన్ఎం2ఎం సర్వర్ సాయంతో డ్యాష్ బోర్డుపై ప్రదర్శిస్తుంటారు. అమెజాన్ అలెక్సా ఇంటర్ఫేస్, ఇండియా అర్బన్ డాటా ఎక్స్ఛేంజీ యాప్లలో అందుబాటులోకి వచ్చేలా చూస్తారు. డాటా పరస్పరం మార్పిడికి బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లోని ఇండియా అర్బన్ డాటా ఎక్స్ఛేంజీ(ఐయూడీఈఎక్స్) నిర్వాహకులతో భాగస్వామ్యం కానుంది.
కార్యకలాపాలు ఇలా..
ట్రిపుల్ఐటీలోని స్మార్ట్సిటీస్ రీసెర్చ్ సెంటర్ కింద లివింగ్ ల్యాబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. వర్సిటీ ప్రాంగణంలో 100 ఐవోటీ ఆధారిత సెన్సర్లను అమర్చి సమాచారం సేకరిస్తున్నట్లు ల్యాబ్ లీడ్ ఆర్కిటెక్ట్ అనురాధ వట్టెం తెలిపారు.
* సెన్సర్ల సాయంతో ప్రతి నిమిషానికోసారి నీటి నాణ్యత లెక్కించవచ్చు. ప్రతి నాలుగు గంటలకోసారి గాఢత, టీడీఎస్, పీహెచ్ స్థాయి తెలుసుకోవచ్చు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి గంటకోసారి వినియోగం ఎంతమేర జరిగిందో తెలుసుకునే వీలుంది.
* గాలి నాణ్యతను ప్రతి సెకనుకోసారి రికార్డు చేసి ప్రతి పది నిమిషాలకోసారి డ్యాష్బోర్డుపై ప్రదర్శిస్తుంది.
* వాతావరణ సెన్సర్ల సాయంతో వాయు వేగం, దిశ, ఉష్ణోగ్రత, తేమశాతం, వర్షపాతం, సూర్యకిరణాల రేడియేషన్ తెలుసుకోవచ్చు. కాలుష్యం సమాచారం తెలుస్తుంది.
* లోరావ్యాన్ సాంకేతికతతో ఇంధన వనరుల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
* ప్రత్యేకంగా అమర్చిన కెమెరాల సాయంతో జన సమూహాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
* దీపాలు, ఫ్యాన్లు, ఇతర పరికరాలకు విద్యుత్తు, సౌరశక్తి వాడకం తెలిసే వీలు కలుగుతుంది.
* ఆక్యుపెన్సీ, కార్బన్ డై ఆక్సైడ్, ఏసీ, గాలి నాణ్యత సెన్సర్లను అమర్చి సాధారణ తరగతి గదులను స్మార్ట్గా మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా