Pegasus: పెగాసస్పై దర్యాప్తునకు మమతా సర్కార్ ఆదేశం!
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెగాసస్ స్పైవేర్ సహాయంతో పలువురి ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది.
ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెగాసస్ స్పైవేర్ సహాయంతో పలువురి ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జ్యోతిర్మయి భట్టాఛార్యల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పెగాసస్ స్పైవేర్ జాబితాలో మమతా బెనర్జీ అల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన తరుణంలో మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత దీనిపై ఓ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
‘హ్యాకింగ్ వ్యవహారం, అసలు ఇది ఏవిధంగా జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించాం. ఈ చిన్న చర్య ఇతరులకు మేల్కొలుపు అవుతుందని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా న్యాయం జరగాలన్నదే మా కోరిక. బెంగాల్లో చాలా మంది హ్యాకింగ్కు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని భావించినప్పటికీ.. దర్యాప్తుపై ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. అందుకే దర్యాప్తు కమిషన్ను ఏర్పాటు చేశామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, దేశంలో ప్రముఖుల ఫోన్ నంబర్లు హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయంటూ ఈమధ్యే వచ్చిన నివేదికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీటిలో దాదాపు 300 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ స్పైవేర్ సాంకేతికత సహాయంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు గూడఛర్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేస్తున్నాయి. ఇదే సమయంలో వీటిపై దర్యాప్తు చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.