Police Station: భార్య చేష్టలకు విసిగిపోయి.. పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టి..

భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే నిప్పు అంటించాడు.

Updated : 31 Aug 2021 17:01 IST

రాజ్‌కోట్‌: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే నిప్పు అంటించాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించి ఆ వ్యక్తి ఎక్కడకి పారిపోలేదు. ‘నన్ను అరెస్ట్‌ చేయండి’ అంటూ.. ఠాణా ముందే నిల్చుండిపోయాడు. అందుకు తగ్గట్టుగానే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడా వ్యక్తి. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందని బాధపడ్డాడు. ఆమె నుంచి విముక్తి పొందడానికి బజరంగ్‌వాడిలోని స్టేషన్‌కు నిప్పంటించినట్లు పేర్కొన్నాడు. అయితే.. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు అంటించిన ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు