Immunity against Corona: ఇమ్యూనిటీ వచ్చినా.. నిర్లక్ష్యం వద్దు!
కరోనా వైరస్పై ఎక్కువ మంది ఇమ్యూనిటీ సాధించినప్పటికీ సెకండ్ వేవ్ వంటి మరో విపత్తు రాకుండా ఉండాలంటే కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వహించవద్దని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హెచ్చరిస్తోన్న వైద్య నిపుణులు
దిల్లీ: దేశ జనాభాలో దాదాపు 60శాతం మందికిపైగా కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఈ మధ్యే విడుదలైన సర్వేలో తేలింది. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు జరుపుతోన్న సీరో సర్వేలోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్పై ఎక్కువ మంది ఇమ్యూనిటీ సాధించినప్పటికీ సెకండ్ వేవ్ వంటి మరో విపత్తు రాకుండా ఉండాలంటే కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వహించవద్దని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినా..!
దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు శరీర రోగనిరోధకశక్తిని (Immunity) పెంపొందించుకోవడమే ఏకైక మార్గం. ఇది సాధారణంగా వైరస్ బారినపడి కోలుకోవడం వల్ల లేదా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వృద్ధిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెజారిటీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు నివేదికలు వస్తున్నాయి. అయినా కొవిడ్ నియమావళి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ యుధ్యవీర్ సింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్పై దిల్లీ ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటి (Herd Immunity) సాధించిందని.. అయినా కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సింగ్ స్పష్టంచేశారు. దేశంలో చాలా ప్రాంతాలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించలేదని.. దీంతో వైరస్ ముప్పు ఇంకా పొంచివుందని గుర్తుచేశారు.
నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు..
తీవ్రత తగ్గినట్లు కనిపించినా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందనే విషయాన్ని సెకండ్ వేవ్ మనకు నేర్పించిందని దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పూజా ఖోస్లా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతున్న తీరును చూస్తున్నామని డా.పూజా గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో కార్యకలాపాలన్నీ పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకునే చర్యలు ఇబ్బందికరమైనవేనని అభిప్రాయపడ్డారు. ఇక మూడో ముప్పు తప్పదని.. దానికి కట్టడి చర్యలు ఏమేరకు తీసుకుంటామనే దానిపై ఆ ప్రభావం ఆధారపడి ఉంటుందని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని ప్రొఫెసర్ ప్రజ్ఞా శర్మ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారినపడుతున్నప్పటికీ (Breakthrough Infection) ఆస్పత్రిలో చేరే ప్రమాదం మాత్రం తక్కువగానే ఉందన్నారు. కానీ, భౌతిక దూరం, మాస్కులపై నిర్లక్ష్యం వహించడం వల్ల మరో ముప్పునకు అవకాశం ఇచ్చినట్లేనని డాక్టర్ ప్రజ్ఞా శర్మ హెచ్చరించారు.
వైరస్ బారినపడి కోలుకోవడం వల్ల లేదా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇప్పటికే దాదాపు 70 నుంచి 80శాతం మంది కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ సాధించారని సఫ్దార్జంగ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జుగల్ కిశోర్ పేర్కొన్నారు. మరో 30శాతం మందికి వైరస్ సోకే ముప్పు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే డెల్టా ప్రభావాన్ని చవిచూశామని.. ఇలాంటి సమయంలో మరో కొత్తరకం వేరియంట్ పుట్టుకొస్తే మరో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని జుగల్ కిశోర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆంక్షల ఎత్తివేతతో చాలా ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే వైరస్ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.