Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యం.. కఠిన చర్యలకు సిద్ధమవుతోన్నహోంశాఖ..!
పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. వాటికి అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందన్నారు. ప్రధాని అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించిన ఆయన.. ఇప్పటికే ప్రధాని భద్రతా వ్యవహారంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.
‘న్యాయవ్యవస్థ దేశంలోని ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తుందనే విశ్వాసం నాకుంది. అటువంటి తప్పిదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అవసరమో అవి తీసుకోవాలి. భద్రతా వైఫల్యంపై చర్యలు తీసుకునేందుకు హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే సన్నద్ధమైంది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత భారీ, కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు భేటీ అయ్యాయి. ఇదే సమయంలో భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి.. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పంజాబ్ ప్రభుత్వానిదే బాధ్యత..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రమైన వైఫల్యాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని క్షమించలేమని అన్నారు. పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని వంటి వ్యక్తులకే భద్రత కల్పించలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఈ తరహా నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.