Mineral water: అక్కడ మినరల్‌ నీటి సీసాలు బంద్‌!

సిక్కింలో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మినరల్‌ నీటి సీసాల వినియోగాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం

Updated : 03 Oct 2021 07:01 IST

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మినరల్‌ నీటి సీసాల వినియోగాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం గ్యాంగ్‌టక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిషేధం అమలు తర్వాత హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన మంచినీటిని వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్‌ సీసాల్లో ఉండే నీటి కంటే ఇది చాలా ఆరోగ్యకరమైనదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని