నన్నే ప్రశ్నిస్తావా?యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పంజాబ్ కాంగ్రెస్కు మరో తలనొప్పి ఎదురైంది. అగ్రనేతలతో ఇబ్బంది పడుతోన్న ఆ పార్టీకి ఎమ్మెల్యే రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తనను ప్రశ్నించిన ఓ యువకుడిపై పార్టీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
చండీగఢ్: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న పంజాబ్లో కాంగ్రెస్కు మరో తలనొప్పి ఎదురైంది. అగ్రనేతల వర్గపోరుతో ఇబ్బంది పడుతోన్న ఆ పార్టీకి ఎమ్మెల్యే రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తనను ప్రశ్నించిన ఓ యువకుడిపై పార్టీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆ వీడియోలో పఠాన్కోట్లోని భోవా(BHOA) గ్రామంలో ప్రజలను ఉద్దేశించి జోగిందర్ పాల్ ప్రసంగిస్తున్నారు. ఆ గ్రామంలో పర్యవేక్షించిన పనుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో గుంపులో ఉన్న ఓ వ్యక్తి గొణగడం ఆయన గమనించినప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా అతడు ఆగలేదు. అప్పుడు ఎమ్మెల్యే దగ్గరకు పిలిచి, మైకిచ్చి మాట్లాడమని చెప్పడం కనిపిస్తోంది. ‘నువ్వు మాకు ఏం చేశావ్?’ అంటూ ఆ యువకుడు ప్రశ్నించగా.. ఎమ్మెల్యే సహనం కోల్పోయి, చితకబాదారు. పక్కనే ఉన్న మరికొందరు కూడా జతకలిశారు. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకునే వరకు వారు కొడుతూనే ఉన్నారు. ఈ వీడియోలో ఎమ్మెల్యే తనను తాను నియంత్రించుకోలేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. దీనిపై పంజాబ్ హోం మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా స్పందించారు. ‘ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేం ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడ ఉన్నాం. మేం వారి ప్రతినిధులం’ అని ఆయన మాట్లాడారు.
ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధూ, మాజీ ముఖ్యమంత్రి అమరీంద్ సింగ్ మధ్య విభేదాలతో కాంగ్రెస్ సతమతమైంది. ఆ రాష్ట్రంలో పట్టున్న అమరీందర్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడం, కొత్త ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, సిద్ధూకు పొసగడం లేదన్న కథనాలు కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు