
సంప్రదాయం మార్చని మోదీ.. ఈసారి కూడా వారితోనే దీపావళి..!
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్లోని జైసల్మీర్లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. గురువారం ఆయన నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
ఇదిలా ఉండగా.. పూంచ్ ప్రాంతంలో గత 23 రోజులుగా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన జవాన్లలో మనోధైర్యాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని భారత్కు వచ్చిన వెంటనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం వ్యాక్సిన్ కవరేజ్ తక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.