Pappu: ‘పప్పూ’.. కూడా అన్పార్లమెంటరీ పదమే!
రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావించే ‘పప్పూ’ పదంతో పాటు ‘మిస్టర్ బంటాధార్’ వంటి పదాలను అన్పార్లమెంటరీ జాబితాలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ చేర్చింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ నూతన బుక్లెట్
భోపాల్: చట్టసభల్లో సభ్యులు మాట్లాడే భాష ఎంతో హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒక్కోసారి సభ్యులు అసభ్యకరమైన భాషను వాడతారని.. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచ్చరించకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శాసనసభ సభ్యులు ఉచ్చరించకూడని అసభ్య పదాల (Unparliamentary Words) జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. తాజాగా 38 పదాలు/ పదబంధాలు/ వాక్యాలతో కూడిన ప్రత్యేక బుక్లెట్ను రూపొందించిన ప్రభుత్వం.. వాటిని సభ్యులకు అందించింది. తాజా జాబితాలో రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావించే ‘పప్పూ’ పదంతో పాటు ‘మిస్టర్ బంటాధార్’ వంటి పదాలను చేర్చడం గమనార్హం.
మధ్యప్రదేశ్లో విధాన సభ ప్రారంభమైన నాటి నుంచి వందల పదాలను అన్పార్లమెంటరీ భాషలో పొందుపరచారు. సమావేశాల్లో ప్రసంగించే సభ్యులు అలాంటి పదాలను వాడకూడదని సూచిస్తూనే ఉంటారు. తాజాగా ఆ జాబితాలో ‘పప్పూ’, ‘మిస్టర్ బంటాధార్’ వంటి పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు డోంగీ (మోసగాడు), నీకమ్మా (పనికిరాని), చోర్ (దొంగ), భ్రస్ట్ (అవినీతిపరుడు), గూండా వంటి హిందీ పదాలను అన్పార్లమెంటరీ పదాల జాబితాలో పొందుపరచారు. ఈ జాబితాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, మంత్రి నరోత్తమ్ మిశ్రాతో పాటు అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్లు విడుదల చేశారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చట్టసభలో భాషపై అవగాహనకు సంబంధించి సభ్యుల కోసం ఈ బుక్లెట్ను అందించారు. సభలో మాట్లాడేటప్పుడు సభ్యులు ఉపయోగించకూడని పదాలను మరచిపోవడం చాలాసార్లు జరుగుతుందని.. అలాంటి సందర్భంలో సభ్యులకు ఈ బుక్లెట్ ఎంతగానో దోహదపడుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయాలుగా అభివర్ణించే (పార్లమెంట్, విధాన సభ) వేదికలపై చట్టసభ సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు.
ఇదిలాఉంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎగతాళి చేయడం కోసం ఆయన వ్యతిరేకులు లేదా భాజపా మద్దతుదారులు పప్పూ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇక మిస్టర్ బంటాధార్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ను విమర్శించడం కోసం వాడుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.