IHU Variant: ఫ్రాన్స్లో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే ఎక్కువ వ్యాప్తి?
ఒమిక్రాన్ వేరియంట్ కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వేళ.. ఫ్రాన్స్లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్ వెలుగు చూసింది.
ఒమిక్రాన్ కంటే అధిక మ్యుటేషన్లు గుర్తింపు
పారిస్: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. ఆయా దేశాల్లో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. డెల్టాతో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఈ ఆందోళనకర వేరియంట్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు చాలా దేశాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇలా ఒమిక్రాన్ వేరియంట్ కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వేళ.. ఫ్రాన్స్లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్ వెలుగు చూసింది. అంతేకాకుండా ఒమిక్రాన్ కంటే ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు తేలడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రాబల్యం అధికంగా ఉన్న యూరప్లో తాజాగా మరో కొత్తరకం వేరియంట్ బయటపడింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని అంటువ్యాధుల పరిశోధన కేంద్రం నిపుణులు వెల్లడించారు. ఈ వేరియంట్ను IHU (B.1.640.2) రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇందులో దాదాపు 46 మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఈ వేరియంట్కు సంబంధించి ఫ్రాన్స్లోని మార్సిల్లెస్ నగరంలో ఇప్పటికే 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్ బయటపడినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్లపై ఈ కొత్త వేరియంట్ ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పడం తొందరపాటే అవుతుందని ఫ్రాన్స్ నిపుణులు పేర్కొన్నారు.
ప్రమాదకరం కాకపోవచ్చు..!
ఫ్రాన్స్లో వెలుగుచూసిన ఈ కొత్తరకం వేరియంట్పై అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్, హెల్త్ ఎకనామిస్ట్ ఎరిక్ డింగ్ స్పందించారు. కొత్త వేరియంట్లో 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లు జరిగినట్లు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాన్ని ఎరిక్ డింగ్ ట్విటర్లో పంచుకున్నారు. అయితే, భవిష్యత్తులో ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న ఆయన.. ఇలాంటివన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వేరియంట్ విస్తృతి, గతంలో వచ్చిన ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్ మాదిరిగా ఆందోళనకర వేరియంట్గా పరిగణిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ ఏ విభాగం కిందకు వస్తుందనే విషయాన్ని పరిశీలించాలని.. తద్వారా వైరస్ ప్రాబల్యంపై ఓ అంచనాకు రావచ్చని ఎరిక్ డింగ్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచదేశాల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 10లక్షల పాజిటివ్ కేసులు బయటపడడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ 130 దేశాలకుపైగా విస్తరించింది. అయితే, ఫ్రాన్స్లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్ కేసులు ఇతర దేశాల్లో నమోదైన దాఖలాలు లేవు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ ఫ్రాన్స్లో బయటపడిన వేరియంట్ మరోసారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ