Omicron Effect: మెట్రోనగరాల్లో కొవిడ్ మహమ్మారి ఉగ్రరూపం..!
గురువారం నాడు ఒక్క ముంబయి నగరంలోనే 20వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశ రాజధానిలోనూ 15వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ముంబయి, దిల్లీ నగరాల్లో రికార్డు స్థాయి కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముంబయి, దిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో కొవిడ్ ఉద్ధృతి అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం నాడు ఒక్క ముంబయి నగరంలోనే 20వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశ రాజధానిలోనూ 15వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోల్కతాలోనూ దాదాపు 10వేల కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మొదలైన కొవిడ్ విజృంభణ.. మరికొన్ని రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముంబయిలో..
మునుపటి వేవ్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా కొవిడ్ ఉద్ధృతి మహారాష్ట్రలోనే అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముంబయి మహా నగరంలో ఊహించని రీతిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నిత్యం అక్కడ రెట్టింపు స్థాయిలో కేసులు రికార్డు కావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే ముంబయిలో 20,181 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. అంతకు ముందురోజుతో పోలిస్తే 30శాతం పెరుగుదల కనిపించింది. ఒకేరోజు ఈ స్థాయిలో నమోదు కావడం కూడా కొవిడ్ వెలుగు చూసిన తర్వాత ఇదే తొలిసారి. అయితే, పాజిటివ్ కేసుల్లో దాదాపు 85శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని.. వీరిలో 1170 మంది ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
రాజధాని దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలోనూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 15,097 కేసులు రికార్డు కాగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివిటీ రేటు 15శాతం దాటినట్లు తెలిపింది. ముందురోజుతో పోలిస్తే పాజిటివ్ కేసుల్లో 30శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. అయితే, ఆస్పత్రి చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నాయని.. ప్రస్తుతం వెయ్యి మంది కొవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోల్కతాలో పెరుగుతున్న కేసులు..
అటు పశ్చిమ బెంగాల్లోనూ కొవిడ్ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 14వేల పాజిటివ్ కేసులు బయటపడినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోల్కతాలో కొవిడ్ పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే అక్కడ 9వేల పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈరోజు కూడా భారీగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. దీంతో మరిన్ని కొవిడ్ ఆంక్షలు తప్పవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంకేతాలిచ్చారు.
వీటితో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్వే ఉంటున్నట్లు ఆయా రాష్ట్రాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2135 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. ఒక మరణం సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 4లక్షల 82వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.