దీపావళి వేళ బిహార్‌లో ఘోరం: కల్తీ మద్యం తాగి 9 మంది మృతి

దీపావళి పండగ వేళ బిహర్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తొమ్మిది మంది ప్రాణాలు తీసింది.

Updated : 04 Nov 2021 15:43 IST

పలువురికి అస్వస్థత

పట్నా: దీపావళి పండగ వేళ బిహర్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. అస్వస్థతకు గురైన మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ నావల్ కిశోర్ చౌదరీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరగవచ్చన్న సమాచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని