Precaution Dose: బూస్టర్ డోసుగా ఏ టీకాను ఇవ్వనున్నారు..?
మిక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో మూడో డోసు ఉండదని.. కేవలం ఇదివరకు రెండు డోసుల్లో తీసుకున్న (కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్) వ్యాక్సిన్నే ప్రికాషన్ డోసుగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఏం చెబుతున్నాయంటే
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న వేళ ఇదివరకే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు (ప్రికాషన్ డోసు) ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 10వ తేదీ నుంచి తొలుత వీటిని ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు తీసుకున్న డోసునే బూస్టర్ డోసుగా ఇస్తారా లేక ఇతర వ్యాక్సిన్ను ఇస్తారా అనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. మిక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో మూడో డోసు ఉండకపోవచ్చని.. కేవలం ఇదివరకు రెండు డోసుల్లో తీసుకున్న (కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్) వ్యాక్సిన్నే ప్రికాషన్ డోసుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో డోసు తీసుకున్న తర్వాత ఎన్ని నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వాలనేదే ముఖ్యమైన అంశమని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల విరామం తర్వాతే దీన్ని ఇచ్చే అంశాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తోందని చెబుతున్నాయి. అయితే, కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామ సమయం భిన్నంగా ఉన్నందున మూడో డోసుకు అదేవిధంగా ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందం నేడు భేటీ కాగా.. త్వరలోనే బూస్టర్ డోసు, వ్యవధిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇలా బూస్టర్డోసు ఇచ్చే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్లు కాకుండా మిక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో ఇతర వ్యాక్సిన్లను బూస్టర్గా ఇవ్వడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను తమ బూస్టర్ డోసు వృద్ధి చేస్తోందని ఆస్ట్రాజెనెకా కూడా ఇటీవలే వెల్లడించింది. ఇలా బూస్టర్ డోసుపై భిన్న నివేదికలు, ఒక్కో రకమైన ఫలితాలు వినిపిస్తోన్న వేళ.. భారత్లో ఏ టీకాను ప్రికాషన్ డోసుగా ఇస్తారనే అంశం తెరమీదకు వచ్చింది. దీంతో ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్నే మూడో డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో