Alpha, Delta: దేశంలో కొత్త వేరియంట్లు లేవ్..!
దేశంలో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఆల్ఫా, డెల్టా వంటి రకాలు మినహా కొత్త వేరియంట్ల ప్రభావం లేదని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం వెల్లడించింది.
కేంద్ర బయోటెక్నాలజీ విభాగం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ.. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభణ అధికంగా ఉన్న కేరళలో కొత్త వేరియంట్ల ప్రభావం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఆల్ఫా, డెల్టా వంటి రకాలు మినహా.. కొత్త వేరియంట్ల ప్రభావం లేదని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడిన (బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్) కేసులకు చేపట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్లో కొత్తగా వేరియంట్లు గుర్తించలేదని పేర్కొంది.
‘ప్రస్తుతం దేశంలో వ్యాప్తిలో ఉన్న ఆల్ఫా, డెల్టా వంటి కరోనా రకాల ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాం. ఇప్పటివరకు 80వేల కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తి చేశాం. ఇలా బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లపై ఇప్పటివరకు చేపట్టిన సీక్వెన్సింగ్లో ప్రస్తుతం విస్తృతిలో ఉన్న వేరియంట్లు మినహా.. కొత్త వేరియంట్లు బయటపడలేదు’ అని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టే కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయికి విస్తరించనున్నామని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకునే పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు.
అన్ని కరోనా రకాలకు ఒకే వ్యాక్సిన్..
కరోనా వైరస్లన్నీంటిని ఎదుర్కొనే ఒకే రకమైన వ్యాక్సిన్ ( Pan-Corona ) రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని డాక్టర్ రేణు స్వరూప్ వెల్లడించారు. తద్వారా ఏదైనా కరోనా వైరస్ వర్గానికి చెందిన వైరస్ కొత్తగా వెలుగు చూస్తే అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందన్నారు. ఇప్పటికే జైడస్ క్యాడిలాకు అనుమతి రాగా.. సెప్టెంబర్ చివరి నాటికి బయోలాజికల్ ఇ అత్యవసర వినియోగానికి అనుమతి చేసుకునే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. ఇది కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని రేణు స్వరూప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్ థర్డ్వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ అంచనా వేసింది. ఇందులో పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా ప్రభావితం కావొచ్చని పేర్కొంది. ‘థర్డ్వేవ్ ప్రిపేర్డ్నెస్: చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ శీర్షికన వెలువడిన ఈ నివేదిక ప్రస్తుతం దేశంలో చిన్నారులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత