Omicron vs Delta: ఒమిక్రాన్లో డెల్టా కంటే రెట్టింపు మ్యుటేషన్లు..!
ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్లో డెల్టా కంటే రెట్టింపు మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రజలు అలసత్వం వహించవద్దని హెచ్చరించిన కేంద్రం
దిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ సృష్టించిన విలయం కారణంగా వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితికి ప్రమాదకర డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇదే సమయంలో ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్లో డెల్టా రకం కంటే రెట్టింపు మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా సంక్రమణ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
‘ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్కు సంబంధించిన అన్ని కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ తీవ్ర లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఒమిక్రాన్లో మొత్తం 45 నుంచి 52 మ్యుటేషన్లు జరిగితే.. అందులో 26 నుంచి 32 వరకు కేవలం స్పైక్ ప్రొటీన్లోనే చోటుచేసుకున్నాయి. ఇలాంటి మ్యుటేషన్లను ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా త్వరగా గుర్తించవచ్చు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే కణానికి అతుక్కుపోయే సామర్థ్యం ఈ రకానికి ఎక్కువగా ఉంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ వేరియంట్పై చేపట్టిన విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూరప్లోనే అధికం..
‘యూరప్లో కొవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజారోగ్య చర్యలపై హెచ్చరికలు చేస్తూనే ఉంది. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వల్లే యూరప్లో వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. గతవారం జర్మనీలో 75వేల కేసులు, బ్రిటన్లో 47వేల కేసులు, ఫ్రాన్స్లో 50వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పోలిస్తే భారత్తో సహా మొత్తం 11 ఆగ్నేయాసియా దేశాల్లో గతవారం 1.2లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో ఇది కేవలం 3.1శాతమే. దీన్నిబట్టి చూస్తే ఆగ్నేయాసియా ప్రాంతంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గడం కనిపిస్తోంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేసింది.
ఇక కేరళ, మహరాష్ట్రలోనే కొవిడ్ తీవ్రత అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రెండు రాష్ట్రాల్లోనే ప్రస్తుతం 10వేల క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 55శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.9శాతంగా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత