Omicron: ఒమిక్రాన్ను.. సహజ వ్యాక్సిన్ అనుకోవడం ప్రమాదకరమే..!
ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్న తరుణంలో.. అటువంటి ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒమిక్రాన్పై ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్నప్పటికీ దాని వల్ల వ్యాధి తీవ్రత, ఆస్పత్రి ముప్పు తక్కువేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్గా పనిచేస్తుందనే ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘ కొవిడ్ (Long Covid) పర్యవసానాలపై స్పష్టత లేనందున అటువంటి ఆలోచన మంచిది కాదన్నారు.
సహజ వ్యాక్సిన్గా ఒమిక్రాన్ పనిచేస్తుందని వస్తోన్న వార్తలను ప్రముఖ వైరాలజిస్ట్, ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మాజీ చీఫ్ డాక్టర్ షాహిద్ జమీల్ తోసిపుచ్చారు. ఇలా భావించడం అత్యంత ప్రమాదకరమన్న ఆయన.. కొందరు బాధ్యతారహితమైన ప్రజలు ఇటువంటి వాటిని వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాంగ్ కొవిడ్ను పరిగణనలోకి తీసుకోని వారే ఇటువంటివి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి ప్రజల్లో ఆత్మసంతృప్తిని పెంపొందించడమే కాకుండా వైరస్ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా పోషకాహారలోపం, వాయు కాలుష్యం, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్న భారత్లో వైరస్కు ప్రభావితం అవడం మంచిదికాదన్నారు.
‘ఈ వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి. ఇతర వేరియంట్లనుంచి వ్యాక్సిన్ కంటే సహజంగా వైరస్ బారినపడడం వల్ల ఆశించిన రక్షణ లభించదు. ఒమిక్రాన్ తీవ్రత స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ ఇది వ్యాక్సిన్ కాదు’ అని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ప్రొఫెసర్ గిరిధర బాబు పేర్కొన్నారు.
వైరస్ సోకడం వల్ల దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ ఆస్పటల్స్ వ్యవస్థాపకుడు శుచిన్ బజాజ్ పేర్కొన్నారు. ఆర్నెళ్ల తర్వాత కూడా కొందరిలో ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిన్, కిడ్నీలకు సంబంధించి దుష్ర్పభావాలు కనిపిస్తున్నాయి. లాంగ్ కొవిడ్కు సంబంధించి ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే విషయంపై కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అందుకే దీన్ని వ్యాక్సిన్గా పరిగణించలేం. ఇది వైరస్ మాత్రమేనని.. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లక్షణాలు, ఆస్పత్రి చేరికలు, మరణాలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్ మాదిరిగా పనిచేస్తుందనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొవిడ్ మహమ్మారి ఎండమిక్ (స్థానికంగా వ్యాప్తి చెందే) స్థాయికి చేరుకుంటుందని వారు అంచనా వేసి చెప్పడాన్ని వైద్యనిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే, వ్యాక్సినేషన్తోపాటు నేచురల్ ఇన్ఫెక్షన్ నుంచి కొవిడ్ను ఎదుర్కొనే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇటీవలే పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)