Covid Variant: ‘మేం అత్యవసర పరిస్థితి అంచున ఉన్నాం’
అసాధారణ మ్యుటేషన్లతో కలవరపెడుతున్న కొత్త వేరియంట్( బి.1.1.529) ఇప్పుడు మరో దేశానికి వ్యాపించింది.
దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్లో కొవిడ్ కొత్త రకం
జెరూసలేం: అసాధారణ మ్యుటేషన్లతో కలవరపెడుతున్న కొత్త వేరియంట్( బి.1.1.529) ఇప్పుడు మరో దేశానికి వ్యాపించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ రకాన్ని తాజాగా ఇజ్రాయెల్లో కూడా గుర్తించారు. ఒక వ్యక్తికి పాజిటివ్గా తేలినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వేరియంట్ ఇప్పుడు ఇజ్రాయెల్లో బయటపడింది. మాలావి నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్ పాజిటివ్గా తేలింది’ అని పేర్కొంది. అలాగే దీనిపై ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు తాము అత్యవసర పరిస్థితి అంచున ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వేగంగా, దృఢంగా ముందుకు సాగాల్సి ఉందని పేర్కొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, హాంకాంగ్లో ఈ కొత్త రకం వెలుగుచూసింది. ప్రస్తుతానికి భారత్లో ఈ రకం ఆనవాళ్లు లేవని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ.. ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కాస్త అదుపులోనే ఉన్నాయి. డెల్టా వేరియంట్తో సతమతమైన పలు దేశాలు ఇప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. ఈ సమయంలోనే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దానిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, లక్షణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటాయన్న వార్తలు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటలీ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. యూకే కూడా ఆరు ఆఫ్రికన్ దేశాలను రెడ్ లిస్ట్లో పెట్టింది. ఐరోపా సంఘం ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం