India Vaccination: వ్యాక్సినేషన్ బిగ్ సక్సెస్.. 11 రాష్ట్రాల్లో తొలిడోసు పూర్తి!
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లోనే అత్యంత విజయవంతంగా కొవిడ్ టీకా కార్యక్రమం కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: కొవిడ్ టీకా పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోయిందని వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ తోసిపుచ్చింది. అలాంటి వార్తలు తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయన్న ప్రభుత్వం.. భారత్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ఒకటని స్పష్టం చేసింది. అంతేకాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లోనే అత్యంత విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపింది. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో వందశాతం అర్హులకు కరోనా తొలిడోసు అందించగా.. మూడు రాష్ట్రాల్లో పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో పేర్కొంది.
‘దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న వేళ.. జనవరి 16, 2021న కరోనా వ్యాక్సిన్ పంపిణీని మొదలుపెట్టి డిసెంబర్ చివరినాటికి 90శాతం అర్హులకు (18ఏళ్ల వయసు పైబడిన) తొలిడోసు అందించాం. మొత్తం అర్హుల్లో 65శాతం మందికి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేశాం. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ యావత్ ప్రపంచం ఊహించని విధంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్నాం. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లను సాధించాం. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోపే 100కోట్ల డోసుల మార్కును అధిగమించాం. ఒక్కరోజే 2.51కోట్ల మందికి వ్యాక్సిన్ అందించి రికార్డు సృష్టించాం. ఒకేరోజులో కోటి డోసులు అందించిన రోజులు చాలా ఉన్నాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్ మెరుగైన పనితీరు చూపుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అర్హులైన వారిలో కేవలం 73శాతం మందికి మాత్రమే అమెరికా ఇప్పటివరకు తొలి డోసు అందించింది. బ్రిటన్ 75.9శాతం, ఫ్రాన్స్ 78.3శాతం, స్పెయిన్ 84.7శాతం అర్హులకు మాత్రమే మొదటి డోసు అందించాయి. భారత మాత్రం 90శాతం (94కోట్ల మందిలో) మందికి తొలి డోసు పంపిణీ చేసింది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రెండో డోసు విషయంలోనూ అమెరికా 61.5శాతం అర్హులకు మాత్రమే అందించింది. బ్రిటన్లో 69శాతం, ఫ్రాన్స్ 73శాతం, స్పెయిన్ 81శాతం మందికి రెండు డోసులు ఇచ్చారు. భారత్లో ఇప్పటికే 65శాతం మంది అర్హులకు పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించామని తెలిపింది.
11 రాష్ట్రాల్లో 100శాతం..
ఇలా ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100శాతం అర్హులకు కరోనా తొలిడోసు అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మూడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు డోసుల పంపిణీ పూర్తి అయ్యిందని తెలిపింది. రానున్న కొద్దిరోజుల్లోనే చాలా రాష్ట్రాలు ఈ ఘనతను సాధించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలాఉంటే, ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకోలేదని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవలే విమర్శలు గుప్పించారు. ‘2021 చివరి నాటికి దేశంలో ప్రతిఒక్కరికీ రెండుడోసుల్లో వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఏడాది ముగింపు అయినప్పటికీ దేశంలో చాలా మంది వ్యాక్సిన్ అందలేదు. మరో వాగ్దానం విఫలమయ్యింది’ అంటూ ట్విటర్లో విమర్శించారు. ఇలా వ్యాక్సినేషన్పై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.