Delta Variant: డెల్టాపై ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల ప్రభావమెంత..?
కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో బయటపడిన (ఆల్ఫా) వేరియంట్తో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక ప్రాబల్యం కలిగిన డెల్టా వేరియంట్పై ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ప్రభావశీలత కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది.
వాస్తవ ఫలితాలపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం
లండన్: కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో బయటపడిన (ఆల్ఫా) వేరియంట్తో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక ప్రాబల్యం కలిగిన డెల్టా వేరియంట్పై ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ప్రభావశీలత కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ ఇతర వేరియంట్ల నుంచి ఈ రెండు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కలిగిస్తున్నాయని తెలిపింది. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్ల వాస్తవ పనితీరును తెలుసుకునేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.
డెల్టాపై ప్రభావం తక్కువే..!
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లన్నింటినీ తొలుత వుహాన్లో బయటపడిన వేరియంట్ ఆధారంగానే రూపొందించారు. క్లినికల్ ప్రయోగాలు కూడా కొన్ని వేల మందిపైనా జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్లపై కరోనా వ్యాక్సిన్ల వాస్తవ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు భారీ అధ్యయనం చేపట్టారు. డిసెంబర్ 1, 2020 నుంచి మే 16, 2021 మధ్య కాలంలో చేపట్టిన ఈ అధ్యయనంలో పాల్గొన్న 3లక్షల 80వేల మంది నుంచి సేకరించిన 25లక్షల స్వాబ్ నమూనాల ఫలితాలను పరిశోధకులు విశ్లేషించారు. వీరి నుంచి మే 17 నుంచి ఆగస్టు 1 వరకు మరోసారి సేకరించిన 8లక్షల ఫలితాలను కూడా విశ్లేషించారు. తద్వారా వైరస్ బారినపడని వ్యాక్సిన్ పొందిన వారితో పోలిస్తే.. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికే టీకాల నుంచి ఎక్కువ రక్షణ కలుగుతోందనే నిర్ధారణకు వచ్చారు. ఇక డెల్టా వేరియంట్ ప్రభావం విషయానికొస్తే.. రెండు మోతాదుల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నమోదైన కేసులు.. వ్యాక్సిన్ తీసుకోని కేసుల్లో డెల్టా ఇన్ఫెక్షన్ స్థాయిలు ఒకే మాదిరిగా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే అల్ఫాలో మాత్రం టీకా తీసుకున్న తర్వాత వైరస్ సోకిన వారిలో ఇన్ఫెక్షన్ స్థాయిలు తక్కువగానే ఉన్నాయని ఆక్స్ఫర్డ్ నిపుణులు కనుగొన్నారు.
టీకా తీసుకోనివారికి పొంచివున్న ముప్పు..!
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడిన (Breakthrough Infection) వారినుంచి ఏ మేరకు వైరస్ సంక్రమణ జరుగుతోందనే విషయం తెలియదని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారా వాల్కర్ పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రం డెల్టా వేరియంట్ నుంచి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. అందుకే సాధ్యమైనంత వరకు పూర్తి మోతాదుల్లో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా ప్రభావశీలతపై రెండు మోతాదుల మధ్య కాల వ్యవధి అంతగా ప్రభావం చూపకపోవచ్చని సారా వాల్కర్ వెల్లడించారు. అయినప్పటికీ రెండు డోసుల తర్వాత కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కొవిడ్ వైరస్ బారినపడే అవకాశాలను ఈ వ్యాక్సిన్లు తగ్గిస్తున్నప్పటికీ.. కొవిడ్-19 ఇవి పూర్తిగా నిర్మూలించలేవని ఆక్స్ఫర్డ్ నిపుణులు మరోసారి గుర్తుచేశారు.
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ నుంచి అధిక రక్షణ కలుగుతున్నప్పటికీ అది కొన్ని నెలలు మాత్రమే ఉంటున్నట్లు తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. కానీ, ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ తీసుకున్న వారిలో త్వరతగతిన ఈ రక్షణ కోల్పోతున్నట్లు నిపుణులు అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఈ రెండు వ్యాక్సిన్ల నుంచి 4 నుంచి 5 నెలల వరకు పూర్తి రక్షణ ఉంటుందని అభిప్రాయపడిన ఆక్స్ఫర్డ్ నిపుణులు.. దీర్ఘకాల రక్షణపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ