Pharmacy of World: ‘ప్రపంచ ఫార్మసీ’గా భారత్..!
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్ సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యస్వామినాథన్
దిల్లీ: ప్రజారోగ్యరంగంలో గత కొన్నేళ్లుగా భారత్ పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మరణాల రేటును తగ్గించడంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని చెబుతున్నారు. ఇలా ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్ సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఏడున్నర దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో భారత్ సాధించిన విజయాలపై ఓ జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య స్వామినాథన్ ప్రస్తావించారు.
పోలియో నిర్మూలన, మాతా శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, పలురకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వంటివి ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా భారత్ అవతరించడానికి దోహదం చేశాయన్నారు. కొవిడ్-19 మహమ్మారి భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆరోగ్య సేవలపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని తెలిపారు. ముఖ్యంగా భారత్లో క్షయ చికిత్స, అసంక్రమిత వ్యాధులు, శిశు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య నిపుణులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశంలో వ్యాధులు పెరుగుదలకు చిన్నారుల్లో పోషకాహార లోపం కారణమవుతోందని యునిసెఫ్ నివేదికలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలకు ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. ఈ పరిస్థితులను కరోనా మహమ్మారి మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యరంగ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి.. అత్యవసరమున్న సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా సంసిద్ధంగా ఉంటేనే అత్యవసర ఆరోగ్య సేవల విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా రాజీపడకుండా వ్యవహరించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇక యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని భారత్ గణనీయంగా పెంచుకుంది. అంతేకాకాకుండా కీలక ఔషధాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను చాలావరకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఇలా ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణల సత్తాను భారత్ చాటిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు