National Unity Day: భారత్కు.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం: మోదీ
అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నివాళి
దిల్లీ: అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
‘భారత్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో, వినయంగా ఉంటూ అందరినీ కలుపుకునేతత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్ మారుతోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు. కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్ షా
దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (Statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్ పటేల్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ను ఏకం చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శించిన ఆయన.. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో