PM Modi: కాశీలో మృత్యువు కూడా మంగళమే: మోదీ
యూపీలోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన .......
వారణాసి: ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్ని ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో నిర్మించిన ఈ కారిడార్ తొలి దశ పనులు ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి. కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విమక్తి లభిస్తుంది. కాశీలో అడుగు పెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం. భారత ప్రాచీనతకు, సంప్రదాయానికీ ఈ కొత్త నడవా ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైంది’’ అన్నారు.
కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా!
‘‘కాశీ విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. నడవాను ప్రారంభించడం నాకు గర్వకారణం. రాత్రింబవళ్లు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్ బృందాన్ని అభినందిస్తున్నా. కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా. కాశీలో మృత్యువు కూడా మంగళమే. కాశీలో ప్రతీ జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడు. కరోనా సమయంలోనూ కాశీలో పనులు వేగంగా జరిగాయి. ఇక్కడి నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. మెగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు’’ చెప్పారు.
ఎన్నో సుల్తాన్ రాజ్యాలు వచ్చాయి, పోయాయి.. కానీ!
కాశీ నాగరికత, వారసత్వాన్ని ప్రధాని కొనియాడారు. ఎన్నో సుల్తాన్ రాజ్యాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బెనారస్ మాత్రం అలాగే ఉందన్నారు. ‘‘దురాక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు.. నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఔరంగజేబు దురాగతాలకు చరిత్రే సాక్షిగా నిలుస్తుంది. కత్తితో నాగరికతను మార్చేందుకు, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేల మిగతా ప్రపంచానికి విభిన్నమైనది. ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వస్తే.. మరాఠా యోధుడు శివాజీ కూడా అవతరించాడు’’ అని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛత, నవకల్పనల కోసం ప్రజలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాశీలో అభివృద్ధి కారిడార్ని ప్రారంభించిన ప్రధాని.. ఈ పనులు దేశానికి సరికొత్త దిశ భవిష్యత్తును చూపిస్తాయన్నారు. కాశీ పుణ్యక్షేత్రం ప్రాచీన, నవభారత సమ్మేళనమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు భారీ సంఖ్యలో సాధువులు పాల్గొన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్