LK Advani: అడ్వాణీ 94వ పుట్టినరోజు.. వేడుకల్లో ఉపరాష్ట్రపతి, ప్రధాని
మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రతో పాటు సీనియర్ మంత్రులు ఎల్కే అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.
భాజపా అగ్రనేతను కొనియాడిన పార్టీ సీనియర్ నేతలు
దిల్లీ: మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం నేరుగా అడ్వాణీ నివాసానికి వెళ్లిన నేతలు.. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం పలు విషయాలపై ఆయనతో ముచ్చటించారు.
అంతకుముందు ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘అడ్వాణీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ప్రజల సాధికారత, మన సాంస్కృతిక గొప్పతనాన్ని మరింత పెంపొందించేందుకు చేసిన కృషికి గానూ యావత్ దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుంది’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
అడ్వాణీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సేవలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మార్గనిర్దేశం చేసిన విషయాన్ని రాజ్నాథ్ గుర్తుచేశారు. అత్యంత మేధస్సు, దూరదృష్టి కలిగిన నాయకుల్లో అడ్వాణీ ఒకరని కీర్తించారు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాజపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంలో ఎల్కే అడ్వాణీ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జేపీ నడ్డా.. తొంభై ఏళ్ల వయసు దాటిన అడ్వాణీ కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!