Corona Virus: గాలి వడపోతతో కరోనాకు చెక్
గాలి వడపోత ద్వారా ఆసుపత్రుల కొవిడ్ వార్డుల్లో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు.
ఆసుపత్రుల్లో వీటిని అమర్చుకోవాలి
‘కేంబ్రిడ్జ్’ శాస్త్రవేత్తల సూచన
లండన్: గాలి వడపోత ద్వారా ఆసుపత్రుల కొవిడ్ వార్డుల్లో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు. ఈ మేరకు వారు ఇటీవల పరిశోధన సాగించారు. కరోనా బాధితులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, చీదినా వారి ముక్కు, నోటి నుంచి గాలి తుంపర్లు విడుదలవుతాయి. కరోనా వైరస్తో కూడిన ఈ ఏరోసోల్స్... కొద్దిసేపటి వరకూ గాలిలో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత నేలపైనో, వస్తువులపైనో వాలిపోతాయి. ఇలా కరోనా వైరస్ వాయు మార్గంలోనూ వ్యాపిస్తుంది. కొవిడ్ బాధితులు చికిత్స పొందే వార్డుల్లో ఈ ముప్పు తీవ్రంగా ఉంటుంది. అందుకే కట్టుదిట్టమైన పీపీఈ కిట్లు ధరించిన చాలామంది వైద్యులు కూడా మహమ్మారికి చిక్కక తప్పలేదు.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు పలు ఆసుపత్రుల కొవిడ్ వార్డుల్లో వాయు నమూనాలను సేకరించి, వాటిలో కరోనా వైరస్ స్థాయులను నమోదు చేశారు. తర్వాత ఆయా చోట్ల హై-ఎఫిషియన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెచ్ఈపీఏ) మెషిన్లను, యూవీ స్టెరిలైజర్లను అమర్చారు.
గాలిలోని అత్యంత సూక్ష్మస్థాయి కణాలను సైతం సమర్థంగా అడ్డుకునే ఈ యంత్రాలను ఏడు రోజులపాటు నిరాటంకంగా వినియోగించారు. ఆ సమయంలో మళ్లీ అక్కడి గాలిని పరీక్షించగా, కరోనా జాడ కనిపించలేదు! దీంతో యంత్రాలను నిలిపివేసి మళ్లీ వాయు నమూనాలను పరీక్షించగా, వైరస్తో కూడిన ఏరోసోల్స్ ఉన్నట్టు తేలింది.‘‘వాయుశుద్ధి యంత్రాలు... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లతో కూడిన గాలి తుంపర్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి. గాలి పరిశుభ్రంగా ఉన్నచోట, వాయుమార్గంలో వ్యాధులు సంక్రమించే ముప్పు చాలా తక్కువే. అలాగని వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎయిర్ ఫిల్టర్లు మాత్రమే సరిపోవు. మాస్కులు ధరించడం, దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వైద్య సిబ్బంది అయితే పీపీఈ కిట్లు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలి’’ అని పరిశోధనకర్త ప్రొఫెసర్ స్టీఫెన్ బేకర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.