Katrina kaif: ‘కత్రినా బుగ్గల్లా రోడ్లు’.. ఆ మంత్రికి సీఎం వార్నింగ్!
రహదారులను బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ నేత రాజేంద్ర సింగ్ గుడాపై సీఎం అశోక్ గహ్లోత్ ఆగ్రహం వ్యక్తంచేశారు......
సూరత్: రహదారులను బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ నేత రాజేంద్ర సింగ్ గుడాపై సీఎం అశోక్ గహ్లోత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా వేదికల్లో మాట్లాడేటప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్లో కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై స్పందించారు. ఏ సందర్భంలో మంత్రి అలా వ్యాఖ్యానించారో తనకు స్పష్టంగా తెలియదని.. తెలుసుకుంటానన్నారు. ప్రతి ఒక్కరూ హుందాగా ఉండాలనే తాను చెబుతున్నట్టు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రి మాటల్లో, ప్రవర్తనలో మరింత హుందాతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మంత్రులు మర్యాదతో వ్యవహరించాలని, తమ పరిధి దాటొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. పరిమితులకు మించి రాజకీయాలు చేస్తే ఎవరూ హర్షించరన్నారు.
తన నియోజకవర్గంలో రహదారులు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలంటూ బుధవారం ఉడైపురవాటి ప్రాంతంలో మంత్రి రాజేంద్ర సింగ్ గుడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆయన మాటలకు అక్కడున్న జనంలో కొందరు హర్షధ్వానాలు చేయగా.. మరికొందరు నవ్వులు చిందించిన విషయం తెలిసిందే.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!