
winter session: ‘అందుకే విపక్షాలను ప్రజలు కూడా బహిష్కరిస్తున్నారు’
దిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలనే విపక్షాల డిమాండ్ల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఎంపీల సస్పెన్షన్ అంశంపై చర్చించేందుకు నాలుగు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కేంద్రం ఆహ్వానం పంపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. శీతకాల సమావేశాల తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఈ రోజు ప్రధాని పార్లమెంట్లో సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు.
ఇక సస్పెన్షన్ అంశంపై ప్రభుత్వం పిలిచిన సమావేశానికి హాజరు కావాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రతిపక్ష పార్టీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడారు. తాము ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి హాజరుకావడం లేదని తెలిపారు. తమ రెండు డిమాండ్లను సభలో వినిపిస్తామన్నారు. సభ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశానికి నాలుగు పార్టీలను ఆహ్వానించి, మిగతా వాటిని వదిలేయడం.. ప్రతిపక్షాలను విడదీసే కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.
విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ‘మేం వారితో మాట్లాడి, పరిష్కారం కనుగొనాలనుకున్నాం. కానీ, వారు సమావేశాన్ని, రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా బహిష్కరించారు. అలాగే ప్రజలు కూడా వారిని బహిష్కరిస్తున్నారని తెలుసుకోవాలి’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలు నేడు కూడా రాజ్యసభలో గందరగోళం సృష్టించాయి. దాంతో ఎగువ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Social Look: కీర్తిసురేశ్ కొత్త లుక్.. శ్రీలీల స్మైల్.. వర్షంలో మౌనీరాయ్!