Rafale: భారత్ కోరితే మరిన్ని రఫేల్ విమానాలను అందిస్తాం: ఫ్రాన్స్
భారత్ అవసరాల మేరకు మరిన్ని రఫేల్ విమానాలను అందించేందుకు ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ప్రకటించారు......
దిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అవసరాల మేరకు మరిన్ని రఫేల్ విమానాలను అందించేందుకు ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ప్రకటించారు. భారత్, ఫ్రాన్స్ ఒకే రకమైన ఆయుధాలు వినియోగించడం రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల బలమైన బంధానికి అద్దం పడుతోందని ఆమె పేర్కొన్నారు. భారత్-ఫ్రాన్స్ సహకారంపై దిల్లీలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పాల్గొన్న పార్లే ఈ వ్యాఖ్యలు చేశారు. మేకిన్ ఇండియాకు మద్దతు ఇచ్చేందుకు ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నట్లు ఫ్లోరెన్స్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు ఫ్లోరెన్స్ పార్లే పేర్కొన్నారు. రఫేల్ జెట్స్తో భారత వాయుసేన సంతృప్తిగా ఉండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సంక్లిష్ట సమయంలోనూ అనుకున్న సమయానికే 36 యుద్ధవిమానాలు భారత్కు అందించడం గొప్ప ఘనతగా అభిప్రాయపడ్డారు. భారత్కు ఇప్పటివరకు 33 రఫేల్ జెట్లు అందించినట్లు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం గురువారం తెలిపింది.
నాలుగేళ్ల తర్వాత భారత అమ్ములపొదిలో..
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.59వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని భారత్.. 2016 సెప్టెంబర్లో కుదుర్చుకుంది. కాగా ఈ విమానాలను ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సుమారు నాలుగేళ్ల తర్వాత గతేడాది జులై 29న తొలి బ్యాచ్లో 5 రఫేల్లు భారత్కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న అవి వాయుసేనలో చేరాయి. రెండో బ్యాచ్లో మూడు రఫేల్ విమానాలు 2020 నవంబర్ 3న భారత్కు చేరుకున్నాయి. మూడో బ్యాచ్లో మరో 3 ఈ ఏడాది జనవరి 27న వాయుసేనలో చేరాయి. తొలి రఫేల్ స్క్వాడ్రాన్ను హరియాణాలోని అంబాలాలో ఏర్పాటు చేశారు. రెండో స్క్వాడ్రాన్ను బెంగాల్లోని బసిమారాలో ఏర్పాటు చేసేందుకు వాయుసేన ప్రణాళికలు చేస్తోంది.
మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
రఫేల్ ఒప్పందం భారత్లో రాజకీయ వివాదంగా మారింది. మోదీ సర్కార్పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఈ ఒప్పందంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తోంది. పార్లమెంటులోనూ ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. ఇదిలా ఉండగా.. భారత్తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు దసో ఏవియేషన్ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్కు చెందిన ‘మీడియాపార్ట్’ జర్నల్ నవంబర్లో సంచలన వార్త ప్రచురించింది. ఇందుకోసం బోగస్ ఇన్వాయిస్లు రూపొందించిందని వెల్లడించింది. ఓ మధ్యవర్తికి దసో ఏవియేషన్ 7.5 మిలియన్ యూరోలు (రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్వాయిస్లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. బోగస్ ఇన్వాయిస్కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్ ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM