Foreign funding: 3ఏళ్లలో ఎన్జీవోలకు రూ.49వేల కోట్ల విదేశీ నిధులు

గడిచిన మూడేళ్లలో భారత్‌లోని 18వేలకు పైగా ఎన్జీవోలకు రూ. 49వేల కోట్ల మేర విదేశీ నిధులు అందాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ

Published : 12 Aug 2021 01:27 IST

దిల్లీ: గడిచిన మూడేళ్లలో భారత్‌లోని 18వేలకు పైగా ఎన్జీవోలకు రూ. 49వేల కోట్ల మేర విదేశీ నిధులు అందాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2017-18లో రూ. 16,940.58 కోట్లు, 2018-19లో 16,525.73 కోట్లు, 2019-20లో 15,853.94 కోట్ల నిధులను ఎన్జీవోలు విదేశీ సంస్థల నుంచి స్వీకరించినట్లు రాయ్ తెలిపారు. 

ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌(రెగ్యులేషన్‌) సవరణ చట్టం - 2020కి ముందు ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఏ షెడ్యూల్డ్‌ బ్యాంకు బ్రాంచీల్లోనైనా తెరుచుకునేందుకు వీలుండేదని రాయ్‌ చెప్పారు. అయితే గత ఏడాది చట్ట సవరణ చేయడంతో ఎన్జీవోలు విదేశీ సంస్థల నుంచి నిధులు తీసుకోవాలంటే.. తప్పనిసరిగా దిల్లీలోని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ప్రధాన బ్రాంచీలో ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలను తెరవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జులై 31 నాటికి దిల్లీ ఎస్‌బీఐ బ్రాంచీలో 18,377 ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని