Sabarimala temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులా మాస పూజకోసం ఈ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆదివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ప్రకటన విడుదల చేసింది. 

Updated : 16 Oct 2021 16:45 IST

రేపటి నుంచి భక్తులకు అనుమతి

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులామాస పూజకోసం ఈ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆదివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ప్రకటన విడుదల చేసింది.

ఆన్‌లైన్ వేదికగా బుకింగ్ చేసుకున్న అయ్యప్ప భక్తులను ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. భక్తులు తమ వెంట వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తీసుకురావాలని దేవస్థానం తెలిపింది. కొవిడ్ నిబంధనల ప్రకారం దర్శనాలను నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే ఆలయ ప్రధాన పూజారిని ఆదివారం ఎంపిక చేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఈ ఎంపిక జరగనుంది.

తులామాస పూజల కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయాన్ని తిరిగి అక్టోబర్ 21న మూసివేయన్నారు. మళ్లీ నవంబర్ రెండున అత్తచితిర పూజ కోసం గుడిని తెరిచి, పూజ అనంతరం మరుసటి రోజే మూసివేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని