Delhi pollution: పెద్దలు ఇంటి నుంచి పనిచేస్తుంటే.. మూడేళ్ల పిల్లలు పాఠశాలకా..?
గత కొద్దివారాలుగా దిల్లీని గాలి కాలుష్యం వేధిస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు.
24 గంటల్లోగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీం
దిల్లీ: గత కొద్దివారాలుగా దిల్లీని వాయు కాలుష్యం వేధిస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. గురువారం విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ‘వాటి వల్ల ఏమీ జరగడం లేదని, కాలుష్యం పెరుగుతూనే ఉందని మేం భావిస్తున్నాం. సమయం మాత్రమే వృథా అవుతుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అలాగే పాఠశాలలు ప్రారంభించడంపై దిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. ‘మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో వెనుకబడిపోతున్నారని, అనేక చర్చల అనంతరం.. ఆన్లైన్ బోధన ఆప్షన్తోనే పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆన్లైన్ బోధనను మీరు ఆప్షన్కు వదిలేశారు. కానీ, ఇంట్లో ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు. మన ఇంట్లో కూడా పిల్లలున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరినుంచి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం’ అంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
‘అలాగే ఈ సంక్షోభంపై విచారణ ప్రారంభమైనప్పుడు కాలుష్యం ఒక స్థాయిలో ఉంది. మీరు ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎందుకు పెరుగుతోంది. ఇది ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న. ఎవరూ ఆ నిబంధనల్ని పాటించడం లేదు. ప్రచారం కోసం మాత్రం పర్యావరణాన్ని కాపాడాలంటూ బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేస్తారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
దిల్లీలో గాలి కాలుష్యం కారణంగా పది రోజుల సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. అలాగే కాలుష్యం అంశంపై గత నాలుగు రోజులుగా వరుసగా సుప్రీం విచారణ చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?