NEET- PG counselling:నీట్-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం

నీట్-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. 2021-22 ఏడాదికి నీట్‌-పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Updated : 07 Jan 2022 12:17 IST

దిల్లీ: నీట్-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. 2021-22 ఏడాదికి నీట్‌-పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

ఈ ఏడాది మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి  ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే నీట్ కౌన్సిలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. ఈడబ్ల్యూఎస్‌ లబ్ధిదారుల్ని గుర్తించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి కూడా ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ జరుపుతామని, ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్‌ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ ప్రవేశాలు తుదితీర్పును లోబడి ఉండనున్నాయి. 

ఇంతకు ముందు జరిగిన విచారణలో భాగంగా.. ఈడబ్ల్యూఎస్‌ లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను కొనసాగించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ప్రవేశాలు, కళాశాలల కేటాయింపులు జరుగుతున్న సమయంలో నిబంధనలు మార్చడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని వెల్లడించింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాదికి వర్తింపజేయవచ్చని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింపజేసేందుకు ₹8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని నీట్‌-పీజీ అభ్యర్థులు కొందరు సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను ఈ పరిమితి నుంచి మినహాయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని