Corona Alert: మనం అలసిపోవచ్చు.. కానీ, కరోనా కాదు!
కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మనం అలసిపోయి ఉండవచ్చేమో గానీ, వైరస్ కాదని హెచ్చరించింది.
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. మనం అలసిపోయి ఉండవచ్చేమో గానీ, వైరస్ కాదని హెచ్చరించింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. కొవిడ్ కట్టడిపై నిర్లక్ష్యం వహించవద్దని దేశప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా పండగల సీజన్ కంటే ముందే భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ నొక్కిచెప్పింది.
రెండే మార్గాలు..
దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా ముగిసిపోలేదని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ పంపిణీపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఛైర్మన్ వీకే పాల్ స్పష్టం చేశారు. వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపించిన జిల్లాల్లోనూ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రేటు మళ్లీ పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాలతో పాటు కేరళలోనూ వైరస్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడం, వైరస్ కట్టడి చర్యలు చేపట్టడం రెండే మార్గాలు మనముందున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లన్నీ పూర్తిస్థాయిలో (100శాతం) గ్యారంటీ ఇవ్వనప్పటికీ.. వైరస్ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయని పేర్కొన్నారు. ఇక మరణం సంభవించే ప్రమాదం దాదాపుగా లేనట్లేనని వీకే పాల్ వెల్లడించారు.
భారీ వేడుకలకు సమయం కాదు..
‘వైరస్ విస్తృతంగా మార్పులకు గురికావడం ఆందోళన చెందాల్సిన విషయం. వీటివల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇప్పటివరకు ఇన్ఫెక్షన్కు గురికాని వారికి వైరస్ బారినపడే ముప్పు మరింత పెరుగుతుంది. అందుచేత అత్యవసరం తప్పితే ప్రయాణాలు మానుకోండి. భారీ సమూహాలకు దూరంగా ఉండండి. పెద్దఎత్తున జరుపుకొనే పండుగలకు ఇది సరైన సమయం కాదు’ అని వ్యాక్సినేషన్పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీ ఛైర్మన్ వీకే పాల్ స్పష్టం చేశారు. కరోనా తొలిదశ కూడా పండుగల సీజన్లోనే వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదిలాఉంటే, దేశంలో 18ఏళ్ల పైడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మెగా డ్రైవ్ను జూన్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 44కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో దాదాపు 9.9కోట్ల మందికి పూర్తిస్థాయిలో (రెండు డోసులు) ఇవ్వగా.. మిగతా వారికి ఒక డోసు ఇచ్చినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్