కుమారుడు కేంద్ర మంత్రయినా.. కూలి పనులకే
తనయుడు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూలి పనులకు వెళ్తున్నారు ఆయన తల్లిదండ్రులు.
విల్లివాక్కం, న్యూస్టుడే: తనయుడు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూలి పనులకు వెళ్తున్నారు ఆయన తల్లిదండ్రులు. భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ స్వగ్రామం తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి సమీపంలోని కోనూరు. ఆయన తండ్రి లోకనాథన్ (65), తల్లి వరదమ్మాల్ (60). వీరు మొదటి నుంచి వ్యయసాయ కూలీలు. వీరి కుమారులు మురుగన్, రామస్వామి. తమ రెక్కల కష్టంతోనే కుమారులను చదివించారు. చిన్న వయసు నుంచే చదువుపై ఆసక్తి ఉన్న మురుగన్ న్యాయవిద్య, ఎంఎల్, పీహెచ్డీ పూర్తి చేశాక భాజపాలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగారు. ఇవేవీ పట్టించుకోకుండా ఆయన తల్లిదండ్రులు తమ పనిని కొనసాగిస్తున్నారు. మురుగన్ సతీమణి కలైయరసి చెన్నైలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. దీనిపై లోకనాథన్ దంపతులు స్పందిస్తూ.. తనతో కలిసి ఉండాలని, కుమారుడు రమ్మని పిలిచారన్నారు.. కానీ సొంత కష్టంతోనే బతకాలని నిర్ణయించుకుని తాము పనులకు వెళ్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా