Corona: చిన్నారుల్లో పెరుగుతోన్న కొవిడ్ ఇన్ఫెక్షన్లు..!
దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు
జోహెన్నెస్బర్గ్: దక్షిణాప్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘గతంలో కరోనా మహమ్మారి వల్ల పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురుకాలేదు. అవన్నీ మనం చూశాం. మూడో వేవ్లో మాత్రం ఐదేళ్ల లోపు పిల్లలు, 15 నుంచి 19 సంవత్సరాల లోపువారిలో ఆసుపత్రిలో చేరిక ఎక్కుగానే కనిపించింది. ప్రస్తుతం మేం నాలుగో వేవ్ ప్రారంభంలో ఉన్నాం. అన్ని వయస్సుల వారితో పాటు మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్న సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే ఆ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల తర్వాత ఐదేళ్ల లోపు వారిలోనే ఈ చేరిక అధికంగా ఉంది. ఈ తీరు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది’ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్ఐసీడీ)కి చెందిన వైద్యులు వాసిలా జస్సాత్ వెల్లడించారు.
అయితే దీనికి సంబంధించి మరింత పరిశోధన అవసరమని ఎన్ఐసీడీకి చెందిన మరో వైద్యాధికారి మిషెల్ గ్రూమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు మేం నాలుగో వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. చిన్న పిల్లల్లో ఈ ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది. మరికొన్ని వారాలు ఈ వయస్సు వారిని పర్యవేక్షించడం ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. వైద్య సేవల విషయంలో ముందస్తు సంసిద్ధత కోసం మేం ఈ విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది’ అని మిషెల్ వెల్లడించారు. చిన్నారులు, గర్భిణీల్లో ఇన్ఫెక్షన్ రేటు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆ దేశ వైద్యశాఖ పేర్కొంది. ‘ప్రస్తుతం కొత్త వేరియంట్ ప్రారంభ దశలో ఉన్నాం. సమాచారం కూడా పరిమితంగానే ఉంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయి. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టీకా తీసుకున్నవారిలో’ అని ఆ దేశ ఆరోగ్య మంత్రి జో పాహ్లా మీడియాకు తెలిపారు. ఆ దేశంలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఏడింటిలో ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు పెరుగుతోందన్నారు.
డెల్టా కారణంగా మూడో వేవ్తో ఉక్కిరిబిక్కిరి అయిన దక్షిణాఫ్రికాలో ఇప్పుడు ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో నాలుగో వేవ్ భయం పట్టుకుంది. కేసులు కూడా అమాంతం పెరుగుతున్నాయి. నిన్న 16,055 మందికి వైరస్ సోకగా, 25 మంది మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.