Omicron: సునామీలా కరోనా కొత్త కేసులు.. హెచ్చరిస్తూనే, భరోసా ఇస్తున్న వైద్యనిపుణులు..!
డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో కేసుల సునామీ వైద్య వ్యవస్థను ముంచెత్తనుంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య సునామీ వలే వైద్య వ్యవస్థను ముంచెత్తనుంది. గత వారంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రోజువారీ కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్ నుంచి పూర్తిగా తేరుకోని ప్రపంచాన్ని.. ఇప్పుడు ఒమిక్రాన్ చుట్టేసింది. అమెరికా, ఫ్రాన్స్, యూకే, డెన్మార్క్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవున్నాయి. భారత్లో కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త కేసులు హఠాత్తుగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
‘డెల్టా వ్యాప్తి కొనసాగుతోన్న సమయంలోనే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ.. కేసుల సునామీని సృష్టిస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వైద్య వ్యవస్థలు, ఇప్పటికే అలసిపోయి ఉన్న వైద్య సిబ్బందిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యానించారు.
ఆక్సిజన్ సిలిండర్లను నిల్వచేయవద్దు..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా ఆక్సిజన్, ఔషధాలను నిల్వ చేసుకోవడం మానుకోవాలని కోరారు. కొవిడ్ ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు వెల్లడైన అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్ సోకితే స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అందువల్ల మెడికల్ ఆక్సిజన్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని అంతా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నియమావళిని పాటించాలని సూచించారు.
ఆక్స్ఫర్డ్ నిపుణుడు ఏం చెప్పారంటే..
నవంబర్లో దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన ఈ వేరియంట్ తక్కువ తీవ్రతను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆసుపత్రుల్లో ఉండాల్సిన సమయమూ తక్కువగానే ఉందని నిపుణులు అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్.. గత ఏడాది చూసిన కరోనా వంటిది కాదని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ జాన్ బెల్ వెల్లడించారు. ‘ఐసీయూలు నిండిపోవడం, కొవిడ్ బాధితుల అకాల మరణాలు.. గత ఏడాది మనం చూసిన ఆ భయానక దృశ్యాలు ఇప్పుడు నా దృష్టిలో చరిత్ర. ఆ పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం లేదని మనకు మనం భరోసా ఇచ్చుకోవాలి’ అని బెల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము కొవిడ్ కఠిన నిబంధనలు తీసుకురాబోమని యూకే ప్రధాని ప్రకటించిన తర్వాత బెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. సునామీలా పెరుగుతున్న కేసులకు తగ్గట్టే మరణాలు లేకపోవడం ఊరటనిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే, గత వారంలో మరణాలు రోజుకు సగటున 6,450గా ఉన్నాయి. 2020 అక్టోబర్ తర్వాత ఇదే అతి తక్కువని ఓ వార్తా సంస్థ నివేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా