Omicron Scare: నగరాల్లో పెరిగిన ఉద్ధృతి.. 8 రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్..!
దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో 14 నగరాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేసింది. మరణాలను తగ్గించాలంటే వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసినట్లు సమాచారం.
తక్షణమే కట్టడి చర్యలు చేపట్టాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొవిడ్ తీవ్రత ఉన్న 14 నగరాలను మరోసారి అప్రమత్తం చేసింది. మరణాలను తగ్గించాలంటే వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు సమాచారం. అంతేకాకుండా దిల్లీలో అమలు చేస్తోన్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మోడల్ను దేశమంతా అమలుచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముంబయిలో కేవలం ఒక్కరోజులోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కేసుల్లో 82శాతం పెరుగుదలతో 2510కి చేరుకున్నాయి. దేశ రాజధాని దిల్లీలోనూ 923 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 86శాతం అధికం. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ఇప్పటికే అక్కడ సామాజిక వ్యాప్తి జరిగిందేమోననే అనుమానాలను దిల్లీ ప్రభుత్వం వ్యక్తం చేసింది. వీటితోపాటు గుర్గావ్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్లోనూ కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్ కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఝార్ఖండ్, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక అత్యధిక వేగంగా వ్యాపిస్తున్నట్లు భావిస్తున్నా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధించేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్