Lakhimpur Kheri violence: ఆ ఘటనలో కేవలం 23 మంది సాక్షులేనా..?
లఖింపుర్ ఖేరి కేసు విషయంలో ఉత్తర్ప్రదేశ్(యూపీ) ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో కేవలం 23 మంది సాక్షులే ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. ఇంకా ఎక్కువ మంది సాక్షుల్ని గుర్తించి, వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.
యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం అసహనం
దిల్లీ: లఖింపుర్ ఖేరి కేసు విషయంలో ఉత్తర్ప్రదేశ్(యూపీ) ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఎందుకు ఉన్నారని నిలదీసింది. ఇంకా ఎక్కువ మంది సాక్షుల్ని గుర్తించి, వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.
‘ఈ కేసుకు సంబంధించి కేవలం 23 మంది సాక్షులే ఎందుకున్నారు..?ఇంకా ఎక్కువ మందిని గుర్తించి, వారి వాంగ్మూలాలు నమోదు చేయాలి. అలాగే సాక్షులకు రక్షణ కల్పించాలి. వాంగ్మూలాలు రికార్డు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, తగిన న్యాయ సిబ్బంది అందుబాటులో లేకపోతే.. దగ్గర్లోని జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి’ అని సుప్రీం వెల్లడించింది.
వారం రోజుల క్రితం జరిగిన విచారణలో కూడా సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. చివరి నిమిషంలో నివేదిక సమర్పించడం, 164 మందిలో 44 మంది సాక్షుల్నే విచారించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను అంతులేని కథగా మార్చకండని వ్యాఖ్యానించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న రైతులపై కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు మృతి చెందారు. అదే సమయంలో అక్కడ చెలరేగిన ఘర్షణలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న ఆశిష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్