Afghanistan: తాలిబన్ 2.0.. చాలా ప్రమాదకరం!
అఫ్గానిస్థాన్లోని కాందహార్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యూహెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ రన్వేపై కదులుతున్న దృశ్యాలు
భారీగా ఆయుధాలు పోగేసుకుని.. ప్రత్యర్థులకు సవాలు
అఫ్గానిస్థాన్లోని కాందహార్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యూహెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ రన్వేపై కదులుతున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ లోహ విహంగంలో తాలిబన్ ఫైటర్లు తిష్ట వేశారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా ఆ హెలికాప్టర్ పైకి ఎగరలేకపోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఆయుధ పాటవాన్ని పెంచుకోవాలన్న ఆ ముఠా దురుద్దేశం ఈ చర్య ద్వారా బట్టబయలైంది.
అఫ్గాన్ రాజధాని కాబుల్ భద్రతను తాలిబన్ ముఠాలోని కొత్తగా ఏర్పాటైన ‘బద్రి 313’ యూనిట్ చూస్తోంది. వీరి ఆహార్యం.. ఆధునిక సైనిక దళాల్లోని సుశిక్షిత కమాండోలను తలపిస్తోంది. అమెరికా నుంచి చేజిక్కించుకొన్న ఆయుధాలు, తూటా రక్షణ కవచాలు, బాలిస్టిక్ హెల్మెట్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు, ప్రత్యేక బూట్లు, మోకాళ్లకు దెబ్బలు తగలకుండా ‘నీ ప్యాడ్లు’, అమెరికన్ తుపాకులు, చీకట్లో వీక్షణకు ఉపయోగపడే సాధనాలు, ప్రయాణాల కోసం దృఢమైన హమ్వీ వాహనాలు ఉన్నాయి. వీరు తాజాగా కాబుల్ విమానాశ్రయం వద్ద హల్చల్ చేస్తున్న ఫొటోలు మీడియాలో వచ్చాయి.
ఎక్కువగా పశు కాపరులు, రైతులతో కూడిన తాలిబన్ ముఠా సభ్యులు ఒకప్పుడు మొరటుగా కనిపించేవారు. వారి వద్ద ఎక్కువగా బైకులు, సైకిళ్లు, పికప్ ట్రక్కులు ఉండేవి. దాదాపు 70 ఏళ్ల కిందట డిజైన్ చేసిన ఏకే-47, 56 తుపాకులే వారి ప్రధాన ఆయుధాలు. ఇప్పుడు తాలిబన్ 2.0 భిన్నంగా కనిపిస్తోంది. వారి చేతిలో అత్యాధునిక ఆయుధాలు మిలమిల మెరుస్తూ కనిపిస్తున్నాయి. పోరాట వాహనాలు, విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్లు పోగేసుకున్నారు. అడుగడుగునా సాంకేతికత సంతరించుకున్న ఆ సాధన సంపత్తి ముష్కర ముఠా వద్ద ఉండటంతో ‘పిచ్చోడి చేతిలో రాయి’లా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ముఠాను ఓడించడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ ‘బద్రి 313’
ఈ దళంలోని ఫైటర్లు.. సాధారణ తాలిబన్ ఫైటర్ల కన్నా మెరుగైన శిక్షణ పొందారు. పాక్ కనుసన్నల్లో నడిచే హక్కానీ నెట్వర్క్ ముఠా కూడా ఇందుకు సాయపడింది. పవిత్ర ఖురాన్లో ప్రస్తావించిన ‘బద్ర్ యుద్ధాని’కి గుర్తుగా ఈ పేరును ఖరారు చేశారు. నాటి యుద్ధంలో మహ్మద్ ప్రవక్త 313 మంది సాయంతో శత్రు సైన్యాన్ని మట్టికరిపించారని చెబుతారు. ఆహార్యంలో అమెరికా సైనికులను అనుకరిస్తున్న ‘బాదర్ 313’ ఫైటర్ల ఫొటోలు, వీడియోలను తాలిబన్లు విడుదల చేస్తున్నారు. తద్వారా తమ సైనిక పాటవం మెరుగుపడిందని, అఫ్గాన్ను సమర్థంగా రక్షించగలమన్న సంకేతాన్నిస్తున్నారు.
కుప్పలు.. కుప్పలు
2001లో తాలిబన్లను తరిమేశాక అమెరికా కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి అఫ్గాన్కు సైన్యం, వైమానిక దళాన్ని ఏర్పాటుచేసింది. 2003-16 మధ్యలో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను ఆ దేశానికి తరలించింది. వీటిలో 3,58,530 తుపాకులు, 64వేల మెషీన్ గన్లు, 25,327 గ్రెనేడ్ లాంచర్లు, 22,174 హమ్వీ వాహనాలు, మందు పాతరలను తట్టుకొనే మ్యాక్స్ప్రో వాహనాలు 20, నవీస్టార్ ట్రక్కులు, ఎం-117 సాయుధ శకటాలు, విమాన విధ్వంసక తుపాకులు, మోర్టార్లు, శతఘ్నులు ఉన్నాయి. 2014లో నాటో దళాలు అఫ్గాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పగించేశాయి. ఈ క్రమంలో అమెరికా మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది. 2017-21 మధ్యలో 20 వేల ఎం16ఎ4 రైఫిల్స్, 3,598 ఎం4 కార్బైన్లు, 3,012 హమ్వీలను తరలించింది. రష్యా కూడా 10వేల కలష్నికోవ్ తుపాకులను ఇచ్చింది. చైనా నలభై టి-54, టి-62 ట్యాంకులను అందించింది. అయినా అఫ్గాన్ సేన తాలిబన్లతో పోరాడలేక చేతులెత్తేసింది. దీంతో వాటిలో చాలావరకూ తాలిబన్ల పరమయ్యాయి.
లెక్కా పత్రం లేదు..
ఈ ఆయుధ సంపద.. తాలిబన్లకు ఇప్పటికిప్పుడు వచ్చిపడినవి కావు. అంతకుముందు నుంచీ అనేక మార్గాల్లో వారికి అవి అందుతూ వచ్చాయి. రెండేళ్ల కిందట అఫ్గాన్లో ఇద్దరు అమెరికా సైనికులు ఎం855 తూటాలతో నేలకొరిగారు. వాటిని అఫ్గాన్ సైన్యానికి అందించిన ఎం4 కార్బైన్, ఎం16ఎ4 రైఫిల్లో ఉపయోగిస్తుంటారు. దీన్నిబట్టి తాలిబన్లకు ఆయుధాలను చేరవేసే ప్రక్రియ అప్పటికే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. వీటి ద్వారానే వారు క్రమంగా బలపడుతూ.. వైరి పక్షాలను బెదిరించి, లొంగదీసుకున్నారు. ఇరాక్ భద్రతా దళాలకు, సిరియా తిరుగుబాటుదారులకూ అమెరికా భారీగా ఆయుధాలు ఇచ్చింది. వాటిలో అనేకం చేతులు మారి, ఉగ్రవాద ముఠాలకు అందాయి. కొన్నింటిని ముష్కరులు సామాజిక మాధ్యమాల్లో విక్రయానికీ పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయుధాలకు సంబంధించిన లెక్కను పక్కాగా నిర్వహించడం ఆధునిక మిలటరీ పద్ధతుల్లో ముఖ్యమైన అంశం. దీనిపై అమెరికా అలసత్వం వహించింది.
ఎంత ప్రమాదకరం..
తాలిబన్లు సంప్రదాయంగా వాడే ఏకే-47 కన్నా తాజాగా సమకూర్చుకున్న ఎం16ఎ4 రైఫిల్ ఎంతో మెరుగైంది. సరైన శిక్షణ పొందిన వ్యక్తి ఈ తుపాకీ సాయంతో 600 మీటర్ల దూరంలోని లక్ష్యంపైకి గురితప్పకుండా తూటాలను ప్రయోగించొచ్చు. ఏకే-47 మాత్రం 400 మీటర్ల దూరంలోని లక్ష్యాలనే గురి తప్పకుండా ఛేదించగలవు. ఎం16ఎ4, ఎం4 కార్బైన్లలో లక్ష్యాన్ని స్పష్టంగా చూడటానికి ‘హోలోగ్రఫిక్ సైట్’ వ్యవస్థ కూడా ఉంది. అమెరికా ప్రత్యేక బలగాలు వాడే శక్తిమంతమైన ‘ఎఫ్ఎన్ స్కార్ రైఫిల్’ కూడా తాలిబన్ల వద్ద ఉన్నట్లు సమాచారం.
రాత్రివేళా పోరాడగలరు..
తాలిబన్ చేతిలో ఇప్పుడు దాదాపు 16వేల నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి. వీటి కారణంగా ఈ ముష్కర ముఠాకు రాత్రివేళ పోరాడే సామర్థ్యం మెరుగుపడింది. వీటికి తోడు 1.62 లక్షల కమ్యూనికేషన్ సాధనాలు ఉండటం వల్ల తాలిబన్లకు మరింత మెరుగ్గా సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహించే సత్తా లభించింది.
సొంత వాయు సేన..
ఈ ఏడాది జూన్లో అఫ్గాన్ వైమానిక దళం వద్ద 167 విమానాలు, పోరాట హెలికాప్టర్లు, సాధారణ హెలికాప్టర్లు, నిఘా కోసం వాడే స్కాన్ ఈగిల్ డ్రోన్లు ఉన్నాయి. భారత్ కూడా నాలుగు ఎంఐ-24 పోరాట హెలికాప్టర్లు, మూడు చీతా హెలికాప్టర్లను అందించింది. వీటిలో ఎన్ని తాలిబన్లకు చిక్కాయన్నదానిపై స్పష్టత లేదు.
అంత సులువేమీ కాదు..
అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిలో కొన్నింటి వినియోగం, నిర్వహణలో తాలిబన్లకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్ల వాడకం కష్టం. ఒకవేళ వీటిని వాడినా.. సకాలంలో సర్వీసింగ్ చేపట్టకుంటే అవి మూలనపడతాయి. వీటి నిర్వహణ కోసం పాక్, చైనా, రష్యా వంటి దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పరారైన అఫ్గాన్ వాయుసేన పైలట్లను బెదిరించి దారికి తెచ్చుకుంటే మాత్రం తాలిబన్లు మరింత ప్రమాదకరంగా తయారవుతారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?