Taliban Govt: ఘనీ తిరిగి రాలేరు.. తాలిబన్లు పాలించలేరు..
అఫ్గానిస్థాన్ను వశం చేసుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. వారి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టంగానే కనిపిస్తోందని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంచనా వేశారు.
ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్
దిల్లీ: అఫ్గానిస్థాన్ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. వారి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టంగానే కనిపిస్తోందని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంచనా వేశారు. మార్పునకు అంగీకరించని మనస్తత్వం కలిగిన వయసు మీరిన ముల్లాలు ఏర్పాటు చేసిన ‘అసమ్మిళిత అద్భుతమైన’ ప్రభుత్వంగా అభివర్ణించారు. అఫ్గాన్ ప్రజలను ఆకర్షించుకోలేకపోయిన తాలిబన్లు.. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదని విలియం డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు. ‘రిటర్న్ ఆఫ్ ఏ కింగ్: ది బ్యాటిల్ ఫర్ అఫ్గానిస్థాన్’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్.. అఫ్గాన్లో తాలిబన్ల ప్రభుత్వం, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
స్థానికుల మద్దతు కూడా కష్టమే..!
సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రటించిన తాలిబన్లు హమీద్ కార్జాయ్వంటి మాజీ అధ్యక్షుడు లేదా అంతకుముందున్న ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. ఇప్పటివరకు అఫ్గాన్ను విజయవంతంగా నడిపించిన ప్రభుత్వాలు అన్ని వర్గాలను సమ్మిళితం చేసుకొని పాలించే ప్రయత్నం చేశాయి. కానీ, ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వం మాత్రం 60శాతంగా ఉన్న అఫ్గాన్ జనాభాను మెప్పించలేపోతుందని.. తాలిబన్లకు మూలమైన పష్టున్లు కేవలం 40శాతం మాత్రమేనని గుర్తుచేశారు. ముఖ్యంగా అక్కడి జనాభాలో సగభాగమైన మహిళలను కూడా భరోసా కల్పించలేకపోతున్నారని డాల్రింపుల్ పేర్కొన్నారు. వారి కేబినెట్లో అందరూ పురుషులూ ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇదీ ఒక విధంగా మంచి పరిణామమేనని.. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం అఫ్గానిస్థాన్ను విజయవంతంగా పాలించే అవకాశం లేదని డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ విషయంలో భారత్ పాత్ర ఏవిధంగా ఉండవచ్చని అడిగిన ప్రశ్నకు ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు.
అఫ్రాఫ్ ఘనీ తిరిగిరావడం కష్టమే..!
అఫ్గానిస్థాన్ ప్రభుత్వంలో ఇతర దేశాల మద్దతు గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకు అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ రాజ్, రష్యన్లు, తాజాగా అమెరికా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధించింది శూన్యమే. ముఖ్యంగా సుదీర్ఘ కాలంపాటు అఫ్గాన్ అధ్యక్షుడిగా ఉన్న హమీద్ కార్జాయ్పాలనలో కొంత మార్పునకు అవకాశం లభించింది. కానీ, తర్వాత వచ్చిన అష్రాఫ్ ఘనీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ఆయన తనదైన స్టైల్లో విభజన రాజకీయాలను చేశారు. విలేకరుల సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టుపై ఆస్ట్రే విసిరిన మూర్ఖపు చర్యలకు పాల్పడిన మనస్తత్వం ఆయనది అని విలియం డాల్రింపుల్ గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో అఫ్గాన్నుంచి పారిపోవడం అఫ్రాఫ్ ఘనీకి మరింత సమస్యేనన్న డాల్రింపుల్.. ఆయన మరోసారి అఫ్గాన్కు వస్తాడని అనుకోవడం లేదని అంచనా వేశారు.
ఇదిలాఉంటే, అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమేనని విలియం డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్థాన్ నుంచి తాలిబన్లు నిధులు, శిక్షణ, ఆశ్రయం పొందారనడంలో ఎటువంటి సందేహం లేదన్న ఆయన.. అవసరమైతే వారికి ఆపన్నహస్తం అందించిన పాకిస్థాన్ నుంచే విముక్తి పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని కొన్నిరోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!