Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
లోక్సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కామెంట్పై ట్వీటర్ యూజర్లు మండిపడుతున్నారు.
దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు కూడా అవుతుంటారు. తాజాగా మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు’ అంటూ ఆయన చేసిన కామెంట్పై ట్వీటర్ యూజర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన శశిథరూర్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ ప్రాంగణానికి చేరుకున్న మహిళా ఎంపీలు.. తోటి సీనియర్ సభ్యుడు శశిథరూర్తో సెల్ఫీ దిగారు. వీరిలో సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమిజాచి తంగపాండియన్, మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్, జ్యోతిమణి ఉన్నారు. కొంతసేపటి తర్వాత దీనిని ట్విటర్లో షేర్ చేసిన శశిథరూర్.. లోక్సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించడంతో వివాదానికి దారితీసింది. ముఖ్యంగా మహిళలను అగౌరవపరిచే విధంగా శశిథరూర్ మాట్లాడారంటూ ఆయన తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మహిళల పట్ల వివక్ష భావనతోనే శశిథరూర్ అలా వ్యాఖ్యానించారని విమర్శలు గుప్పిస్తున్నారు.
మండిపడ్డ మహిళా కమిషన్ ఛైరపర్సన్
శశిథరూర్ ట్విటర్ పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పార్లమెంటుతో పాటు రాజాకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న మహిళలను ఆకర్షణీయ వస్తువుగా పేర్కొంటూ కించపరిచారు. పార్లమెంటులో మహిళలను ఇలా అవమానించడం ఆపండి’ అంటూ ఎంపీ ట్వీట్పై రేఖా శర్మ మండిపడ్డారు. శశిథరూర్ వ్యాఖ్యలపై అటు సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నందీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా ఎంపీల రూపంపై కామెంట్లు చేస్తూ.. విషయాన్ని తనవైపు కేంద్రీకరించుకొని ప్రయోజనం పొందేందుకే ఆయన ప్రయత్నించారని విమర్శించారు.
గుత్తా జ్వాలా స్పందన..
అయితే, నందీ ట్వీట్కు బదులిచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా.. కొన్ని విషయాలను తేలికగా తీసుకోవాలంటూ కరుణా నందీకి సూచించారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దని.. పార్లమెంటులో మహిళా సభ్యులందరికి ఇదో అభినందనగా భావించాలనేది నా అభిప్రాయం అంటూ గుత్తా జ్వాలా పేర్కొన్నారు. అలాగే మీ పని ప్రదేశాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి లోక్సభ మహిళా ఎంపీలు అలంకార వస్తువులు కాదంటూ మరో ట్విటర్ యూజర్ శశిథరూర్పై మండిపడ్డారు. మీలాగా వారు కూడా పార్లమెంట్ సభ్యులేనని.. అటువంటి వారిని అగౌరవపరుస్తూ మహిళల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు.
ఇలా ట్విటర్లో తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన శశిథరూర్.. అందరం కలిసిన సందర్భంగా (మహిళా ఎంపీల చొరవతోనే) సరదాగా ఆ సెల్ఫీ తీసుకున్నాము. అదే స్ఫూర్తితో ఆ ఫొటోపై ట్విట్ చేయమని వారే నన్ను కోరారు. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అయినప్పటికీ పని ప్రదేశంలో అలా చోటుచేసుకున్న సరదా సంభాషణలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ట్విటర్లో మరోసారి బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల