Bharat Bandh: బంద్లో రైతన్నలు.. దిల్లీ సరిహద్దుల వద్ద భద్రత పెంపు
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్ బంద్ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఈ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పలు రాష్ట్రాల్లో ట్రాఫిక్కు అంతరాయం
(ప్రతీకాత్మక చిత్రం)
దిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్ బంద్ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఈ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా తమ ఆందోళనలో పాల్గొనాలని ఆదివారం ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. అలాగే ఈ బంద్కు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ బంద్ కొనసాగనుంది.
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది. రాజధాని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి గాజిపూర్ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. దాంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్ని సాయంత్రం నాలుగు వరకు ముట్టడిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. తమ ట్రాక్టర్లతో ప్రధాన రహదారుల్ని దిగ్బంధించారు. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. యూపీ, పంజాబ్ ప్రభుత్వాలు ట్రాఫిక్ మళ్లింపు అడ్వైజరీని జారీ చేశాయి. బంద్ నడుస్తున్నప్పటికీ.. దిల్లీలో మాత్రం ప్రజా రవాణా కొనసాగుతోంది. మెట్రో సేవల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా బస్సు సేవల్ని నిలిపివేసింది.
స్పందించిన రాహుల్, మాయావతి, ఇతర నేతలు..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న రైతు సంఘాలకు పలువురు మద్దతు ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడుతూ.. ‘రైతుల శాంతియుత సత్యాగ్రహం దృఢంగా సాగుతోంది. దోపిడీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదు. అందుకే భారత్ బంద్కు పిలుపునిచ్చాం’ అని అన్నారు. ఈ బంద్పై నిన్న మాయావతి ట్వీట్ చేశారు. ‘కేంద్రం హడావుడిగా తీసుకువచ్చిన చట్టాలను రైతన్నలు ఆమోదించలేదు. వాటి రద్దు కోసం గత 10 నెలలుగా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ శాంతియుత నిరసనకు బీఎస్పీ మద్దతు ఇస్తోంది’ అని అన్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో విపక్ష నేతలు బంద్ పాటిస్తున్నారు. రైతులు శాంతియుతంగా తమ నిరసన స్వరాన్ని పెంచాలని పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. -
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ చేయొచ్చు
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
-
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
-
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!