Omicron: ఒమిక్రాన్ భయం.. మళ్లీ ఆంక్షల గుప్పెట్లో పలుదేశాలు!
ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ భయాలు.......
ఇంటర్నెట్ డెస్క్: ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ భయాలు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఒమిక్రాన్ రూపంలో మళ్లీ ఈ మహమ్మారి ఉరుముతుండటం జనావళిని భయపెడుతోంది. ఇప్పటికే దాదాపు 89 దేశాలకు పాకిన ఈ కొత్త వేరియంట్.. బ్రిటన్ను వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ ఏకంగా 10వేల ఒమిక్రాన్ కేసులు రావడం కలవరపెడుతోంది. డిసెంబర్ 8న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన ఆంక్షలు కొనసాగుతుండగానే తొలి ఒమిక్రాన్ మరణం కూడా అక్కడే నమోదు కావడం.. తాజాగా ఆ సంఖ్య 12కి చేరడంతో క్రిస్మస్ కన్నా ముందే మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే కొన్ని దేశాలు ఒమిక్రాన్కు చెక్ పెట్టేందుకు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలుచేస్తున్నాయి.
యూకే..
డెల్టా రకం కన్నా ఆరు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం డిసెంబర్ 8న పలు ఆంక్షలు ప్రకటించింది. యూకే ప్రజలు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించడంతో పాటు మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ పాస్లు ఉపయోగించడం వంటి నిబంధనలు అమలుచేయాలని ఆదేశించింది. తాజాగా అక్కడ కేసులు భారీగా పెరుగుతుండటం, 12మంది వరకు మరణించడం, మరో 102మంది వరకు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తరుణంలో కఠిన ఆంక్షలు విధించే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. క్రిస్మస్కు ముందే అక్కడ కఠిన ఆంక్షలు విధించే అవకాశాలను బ్రిటన్ ఉప ప్రధాని డోమినిక్ రాబ్ కొట్టిపారేయకపోవడం గమనార్హం.
అమెరికా..
అమెరికాలోని కాలిఫోర్నియాలో మాస్క్ ధరించడం తప్పనిసరి నిబంధన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇళ్లలోనూ ప్రజలు మాస్క్లు ధరించాలని కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీచేశారు. క్రిస్మస్ సెలవుల్లో ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితుల్ని కలుసుకొనే అవకాశం ఉండటంతో మాస్క్ తప్పనిసరి నిబంధనను అమలు చేశారు. ఈ నిబంధనను ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు అమలు చేయనున్నట్టు తెలిపారు. గతంలో రెండు వారాల వ్యవధిలోనే కాలిఫోర్నియాలో కొవిడ్ కేసులు 47శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రాన్స్..
క్రిస్మస్ కన్నా ముందే ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి పౌరులకు విజ్ఞప్తి చేసింది. లాక్డౌన్ మరోసారి విధించే పరిస్థితి తీసుకురావొద్దని కోరింది. ఐదో తరంగం ఇక్కడ చాలా బలంగా ఉంది అంటూ ప్రధాని జీన్ కాస్టెక్స్ శుక్రవారం తెలిపారు.
నెదర్లాండ్స్..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో నెదర్లాండ్స్ కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. అత్యవసరం కాని దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లను జనవరి 14వరకు మూసిఉంచాలని నిర్ణయించింది.
నార్వే..
ఒమిక్రాన్కి చెక్ పెట్టేందుకు నార్వే కూడా లాక్డౌన్ తరహా నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఇప్పటివరకూ 3లక్షల వరకు కేసులు నమోదవడంతో నిపుణుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని కఠిన ఆంక్షలు పెట్టాలని నిర్ణయించింది. బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరాను నిషేధించింది. అలాగే, ఇంటి నుంచే పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశించింది.
జర్మనీ..
జర్మనీలో వ్యాక్సిన్ వేసుకోనివారిపై కఠిన ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఒమిక్రాన్ వ్యాప్తికి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీకా వేసుకోని వారిని అత్యవసరాలైన (కిరాణా దుకాణాలు, ఫార్మసీ, బేకరీలు) వంటి ప్రదేశాలు మినహా మిగతా చోట్లకు వెళ్లడంపై నిషేధం విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు