Farm Laws: అమలుకు ముందే రద్దుకు.. సాగుచట్టాల ‘ప్రస్థానం’ సాగిందిలా!
వ్యవసాయ రంగానికి సంబంధించి.. రైతులు తమ పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందేందుకూ; ప్రైవేటు పెట్టుబడులు, సాంకేతికతను సమకూర్చుకునేందుకు దోహదపడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను తీసుకొచ్చింది.
రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: పరిపాలనలో భాగంగా విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే ముందు ప్రభుత్వాలు భారీ కసరత్తు చేస్తుంటాయి. కొత్త చట్టాన్ని తెచ్చేందుకు నిర్ణయం తర్వాత తొలుత వాటిని బిల్లు రూపంలో ప్రవేశపెట్టి.. చర్చల ద్వారా చట్టసభల ఆమోదానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలోనే దేశంలో వ్యవసాయ రంగంలో పలు మార్పులను తెచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్తగా మూడు సాగుచట్టాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి.. రైతులు తమ పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందేందుకూ; ప్రైవేటు పెట్టుబడులు, సాంకేతికతను సమకూర్చుకునేందుకు దోహదపడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను తీసుకొచ్చింది.
1. నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండ్మెంట్) బిల్ 2020)
2. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన... ‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు’.
3. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే... ‘ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు-2020’.
అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లులను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. రైతుల హక్కులను కాలరాసేందుకే ఈ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చిందని విరుచుకుపడ్డాయి. అయినప్పటికీ ఎలాగోలా చివరకు వాటిని పార్లమెంటులో ఆమోదముద్ర వేయించున్న ప్రభుత్వం.. భారత రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం కల్పించింది. కానీ, వాటి అమలులో మాత్రం రైతుల్లోని కొన్ని వర్గాలను ఒప్పించ లేకపోయింది. వీటిని వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాది (నవంబర్ 26కు) కాలంపాటు రైతు సంఘాలు ఉద్యమం చేపట్టాయి. ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేసిన ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను కూడా కదిలించాయి. ఇలా రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో వెనక్కితగ్గిన కేంద్ర ప్రభుత్వం.. మూడు చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి గుర్తుచేసుకుందాం.
* జూన్ 5, 2020 : మూడు వ్యవసాయ చట్టాలను తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్) జారీ
* సెప్టెంబర్ 14, 2020 : పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్
* సెప్టెంబర్ 17, 2020 : మూడు బిల్లుకు లోక్సభ ఆమోదం
* సెప్టెంబర్ 20, 2020 : వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
* సెప్టెంబర్ 25, 2020 : వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు
* సెప్టెంబర్ 27, 2020 : రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో చట్టరూపంగా మారిన మూడు బిల్లులు
* నవంబర్ 25, 2020 : వీటిని నిరసిస్తూ ‘చలో దిల్లీ’కి పంజాబ్, హరియాణా రైతులు పిలుపు
* నవంబర్ 26, 2020 : దిల్లీ వైపు దూసుకెళ్లిన రైతులను నగర సరిహద్దుల్లోనే అడ్డుకున్న పోలీసులు
* నవంబర్ 28, 2020 : రైతులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన
* డిసెంబర్ 3, 2020 : తొలిసారిగా రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు.. డిసెంబర్ 5న రెండోసారి చర్చలు
* డిసెంబర్ 8, 2020 : ‘భారత్ బంద్’కు రైతు సంఘాల పిలుపు. ఇందుకు మద్దతు తెలిపిన పలు రాష్ట్రాల రైతులు
* డిసెంబర్ 9, 2020 : చట్టాలకు సవరణ చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదనకు నిరాకరించిన రైతు సంఘాలు
* డిసెంబర్ 11, 2020 : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారతీయ కిసాన్ యూనియన్ (BKU)
* జనవరి 4, 2021 : ఏడోసారి రైతులు - కేంద్రం మధ్య చర్చలు జరిగినప్పటికీ.. చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరణ
* జనవరి 7, 2021 : సాగుచట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం అంగీకారం
* జనవరి 12,2021 : వ్యవసాయ చట్టాలపై ‘స్టే’ విధించిన సుప్రీంకోర్టు, సాగు చట్టాలపై సిఫార్సులు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
* జనవరి 26, 2021 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం. ఆందోళనకారుల నిరసనలతో అట్టుడికిన ఎర్రకోట. ఆరోజు జరిగిన ఘటనలో ఓ రైతు బలి
* జనవరి 29, 2021 : ఏడాదిన్నరపాటు ఈ మూడు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదన
* ఫిబ్రవరి 5, 2021 : రైతుల ఆందోళనలపై తయారుచేసిన ‘టూల్కిట్’ వ్యవహారంపై దిల్లీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు
* మార్చి 6, 2021 : దిల్లీ సరిహద్దులో 100 రోజులకు చేరిన రైతుల ఆందోళన
* మే 27, 2021 : రైతుల ఉద్యమం ఆరు నెలలకు చేరుకోవడంతో ‘బ్లాక్ డే’గా ప్రకటించిన రైతు సంఘాలు
* జులై 22, 2021 : వర్షాకాల సమావేశాల సందర్భంగా దాదాపు 200 రైతులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం
* ఆగస్టు 7, 2021 : సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న 14 ప్రతిపక్ష పార్టీలు
* అక్టోబర్ 22, 2021 : ప్రజలకు నిరసన చేసే హక్కు ఉన్నప్పటికీ.. సుదీర్ఘకాలం పాటు రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని సుప్రీం వ్యాఖ్య
* అక్టోబర్ 29, 2021 : దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టిన ప్రాంతం వద్ద బారీకేడ్లను తొలగించిన దిల్లీ పోలీసులు
* నవంబర్ 19, 2021 : సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!