Covid Effect: కొవిడ్ నీడన.. పెరుగుతోన్న టీబీ మరణాలు!
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో గడిచిన దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా క్షయ (Tuberculosis) మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో గడిచిన దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా క్షయ (Tuberculosis) మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కొవిడ్ కారణంగా క్షయ నిర్ధారణ, చికిత్సలో ఆటంకం కలగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. క్షయ వ్యాధిపై చేస్తోన్న పోరు తగ్గే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీబీ నివారణ, చికిత్సపై శ్రద్ధ చూపాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.
పెరిగిన మరణాలు..
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో ఒకటిగా నిలిచిన క్షయ వ్యాధిపై జరుగుతోన్న పోరులో భాగంగా గత కొన్నేళ్లుగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారి రూపంలో వచ్చిపడిన ఈ పిడుగు ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2020లో 15లక్షల మంది క్షయ రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా అంతకుముందు ఈ సంఖ్య 14లక్షలుగా ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ సంఖ్య లక్ష పెరిగింది. అంతేకాకుండా 2021, 2022 సంవత్సరాల్లో వీటి ప్రభావం అధికంగా ఉండవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తగ్గిన నిర్ధారణ పరీక్షలు..
కొవిడ్ విజృంభణ కారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం 71లక్షల కేసులు నిర్ధారణ కాగా ఈ ఏడాది (2020) ఆ సంఖ్య 58లక్షలకు పడిపోయినట్లు తేలింది. దీంతో నిర్ధారణ కాని క్షయ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా వ్యాధి నిరోధక చికిత్స తీసుకుంటున్న వారి శాతం కూడా భారీగా తగ్గినట్లు వెల్లడైంది. ప్రస్తుతం 28లక్షల మంది మాత్రమే ఈ చికిత్స పొందుతున్నారని.. అంతకుముందుతో పోలిస్తే 28శాతం తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ఆందోళనకర విషయమే..
ప్రమాదకరమైన క్షయ వ్యాధి పోరులో భాగంగా 2030 నాటికి 90శాతం మరణాలు, 80శాతం కేసులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటినుంచి 2020 నాటికి క్షయ మరణాల్లో దాదాపు 9శాతం, కేసుల్లో 11శాతం తగ్గుదల కనిపించింది. కానీ, ఊహించని రీతిలో విరుచుకుపడిన కొవిడ్ మహమ్మారి వల్ల క్షయ నిర్మూలన ప్రణాళికకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్మూలన సాధ్యమైన, చికిత్స అందుబాటులో ఉన్న, ప్రాచీనమైన ఈ వ్యాధి తీవ్రత పెరగడం ఆందోళనకరమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ పేర్కొన్నారు. క్షయ రోగుల సేవలపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడిందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో క్షయ నివారణ, నిర్ధారణ, చికిత్సను అందించడంలో తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే, కొవిడ్-19 కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం క్షయ కేసుల్లో 90శాతం కేవలం ముప్పై దేశాల్లోనే ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా భారత్, నైజీరియా, దక్షిణాఫ్రికా, వియత్నాం దేశాల్లోనే అత్యధిక మంది క్షయ బారినపడుతున్నారు. గతేడాది దాదాపు 15లక్షల మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 2లక్షల 14వేల మంది హెచ్ఐవీ రోగులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2021, 2022 సంవత్సరాల్లో క్షయ బాధితులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు